అల్లు అర్జున్ అభిమానులపై లాఠీ ఛార్జ్

ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ అభిమానుల మీద పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తిరుపతిలొ ఓ నగల షాప్ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ వెళ్లారు. ఈ విషయం ముందే తెలుసుకున్న అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సంధర్భంగా అల్లు అర్జున్ తో కరచాలనానికి పోటెత్తడంతో ఆయన జనం మధ్యలో ఇరుక్కుపోయారు. ఓ దశలో ఆయన ఊపిరి ఆడని పరిస్థితి ఎదుర్కొన్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి సురక్షితంగా పక్కకు తీసుకెళ్లారు. ఈ సంధర్భంగా జరిగిన తోపులాటలో ఓ కానిస్టేబుల్ కు గాయాలు అయ్యాయి. మన దేశంలో సినీ నటులపట్ల ఉన్న క్రేజ్ తగ్గడం లేదు. కొన్ని సార్లు అది హద్దులు దాటితే ఆ అభిమాన నటులకు కష్టాలు తప్పడం లేదు.