కేసీఆర్ ను ఆకాశానికెత్తిన కోమటిరెడ్డి.. టీ కాంగ్రెస్ లో కలకలం

 

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు గంటల పైటు ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన.. అందరి ప్రశంసలు అందుకున్నారు. దేశంలోనే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మొద్దమొదటి వ్యక్తిగా.. అంతేకాకుండా.. ఏకధాటిగా మూడు గంటలు ప్రసంగం చేసిన వ్యక్తిగా కూడా కీర్తి గణించారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన పపర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రతిపక్షనేతలను కూడా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే టీ కాంగ్రెస్ కు ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయంలో కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. సాగు నీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా బాగుందని..పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రస్తావించిన అంశాలకు కార్యరూపం ఇస్తే ఇంకా బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదులో లక్ష ఇళ్లతో పాటు ప్రతి గ్రామానికి 50 ఇళ్లను నిర్మిస్తే... కేసీఆర్ కు ఓటేయమని తానే ప్రజలకు చెబుతానని ఆయన అన్నారు.

 

అయితే కోమటరెడ్డి ప్రశంసించింది బాగానే ఉన్నా..ఆయన వ్యాఖ్యలపై టీ కాంగ్రస్ నేతల్లో గుబులు రేగుతుంది. ఇంత సడెన్ గా కేసీఆర్ ను పొగడటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏ ఉద్దేశ్యంతో కోమటరెడ్డి కేసీఆర్ ను ప్రశంసించారో ఆయనకే తెలియాలి.