TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉపాధ్యాయులకు ఇచ్చిన మాట రేవంత్ నిలబెట్టుకున్నారా?  

Published on: Wed Oct 9, 2024 5:02PM

గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు నియామకపత్రాలను అంద జేసింది.  రాష్ట్రంలో దసరా పండుగ కు  ముందే...పండుగ వాతావరణం నెలకొంది. డిఎస్  సిలో ఎంపికైన అభ్యర్థులకు బుధవారం .ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామకపత్రాలను అందించారు. ఎల్ బీ స్టేడియం వేదికగా జరిగిన కార్యక్రమంలో...దాదాపు పదివేల మందికి పైగా...నియామక పత్రాలను అందుకున్నారు.  ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు...మొత్తం ప్రక్రియను వేగంగా పూర్తి చేయటంతో పాటు...బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా చర్యలు తీసుకుంది.  నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందించారు.