సమ్మె పై ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు వెనక్కు తగ్గనున్నారా?
posted on Oct 7, 2019 @ 12:12PM
క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నఆర్టీసీ సమ్మె టెన్షన్ వీడుతుంది అనుకున్నా అది మాత్రం కొనసాగుతోంది. సిక్స్ పిఎం సర్కారు డెడ్ లైన్ ముగిసింది. కానీ యాక్షన్ రియాక్షన్ పై మాత్రం టెన్షన్ కంటిన్యూ అవుతోంది. సర్కారిచ్చిన సిక్స్ పిఎం డెడ్ లైన్ బేఖాతరు చేస్తూ ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. సర్కారు బెదిరింపులకు భయపడేది లేదని ఖరాకండిగా చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకోబోతోంది అనేది పెద్ద చర్చనీయాశంగా మారింది. ఆర్టీసీ కార్మికులపై ఎటువంటి నిర్ణయం తీసుకోనుందని అనివారిని విధుల నుండి పూర్తిగా తప్పిస్తుందా అసెలేం జరగబోతోంది అనేది పెద్ద చర్చగా మారింది. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై రేపు మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం ఆధ్వర్యంలో రవాణ ఆర్టీసీ పోలీస్ అధికారులు భేటీ కానున్నారు. ఈ చర్చల్లో ఆర్టీసీ భవితవ్యంపై ప్రభుత్వం తేల్చబోతున్నది. ఇప్పటి వరకు జరిగిన అప్ డేట్స్ చూస్తే ఇటు ప్రభుత్వం వెనక్కు తగ్గట్లేదు, అటు కార్మికులు కూడా వెనక్కి తగ్గేట్టు లేరు. కార్మికులైతే ఇంకా పట్టుదలతో ఉన్నారు. రేపు, ఎల్లుండి తమ ఉద్యమానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోలో దాదాపు తొంభై రెండు డిపోలు ఉన్నాయి. తొంభై రెండు డిపోలలో కేవలం నూట అరవై ఐదు మంది ఉధ్యోగులు మాత్రమే విధులలో చేరారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు అంతకు మించి ఉద్యోగులు విధుల్లో చేయడానికి ఆసక్తి చూపించట్లేదు. ఇక అడ్మినిస్ట్రేషన్ సంబంధించి లేదా డిపోలల్లో పనిచేసేటటువంటి, వర్క్ షాపులో పనిచేసేటువంటి కొంతమంది ఉద్యోగాలు మినహాయిస్తే దాదాపు నలభై వేల మంది ఉద్యోగులు ఇప్పటి వరకు ఇక సమ్మెలో కొనసాగుతున్నట్లుగానే భావించాలి అని నిన్న కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఆ తర్వాత రవాణశాఖామంత్రి అజయ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ హెచ్చరించారు. ఈ రోజు కూడా ఒక ఫైనల్ వార్నింగ్ విడుదల చేసింది. అయినప్పటికి కూడా ఉద్యోగులెవ్వరూ కూడా వెనక్కు తగ్గట్లేదు. ప్రభుత్వం తమను బెదిరించాలని చూస్తుందంటూ అయినా తమ లక్షమే ముఖ్యమని వారు భావిస్తున్నారు.