ఎమ్మేల్యే దేవిరెడ్డి మనసులో మాట
posted on Mar 26, 2013 @ 10:34AM
ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మేల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిచాలని కోరగా కాంగ్రెస్ పెద్దలు చెప్పినా ఆ పనిమాత్రం చేయనని అంటూ తన మనసులోని ఆలోచనను బయటపెట్టారు. నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలి అనుకుంటే నన్ను ఆపేవారు ఎవరూ లేరు. నేను అందరికీ చెప్పిన తరువాతనే ఆ పార్టీలోకి వెళతాను. రాత్రికిరాత్రే పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తారా ? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ? అన్న ప్రశ్నకు నేను ఎక్కడ పోటీ చేసినా ఎలాంటి ఇబ్బందిలేదు. నేనేంటో అందరికీ తెలుసు అని అన్నారు.