Read more!

మీరు రోజూ నొప్పి నివారణ మందులు తీసుకుంటున్నారా..ఐతే  ఇది మీ కోసమే ?

తలనొప్పి వచ్చినా, శరీరంలో నొప్పి వచ్చినా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం చాలా మందికి అలవాటుగా మారింది. చాలా మంది తలనొప్పి వస్తే డిస్ప్రిన్, ఒళ్లు నొప్పులకు  కాంబిఫ్లామ్ వంటి మందులు తీసుకుంటారు. ఈ ఔషధాల ప్రభావం త్వరగా కనిపిస్తుంది.  కొన్ని నిమిషాల్లోనే ఉపశమనం కూడా లభిస్తుంది. కొంతమంది  నొప్పి తగ్గే వరకు వైద్యుల సలహా లేకుండా ఇలాంటి మందులను తీసుకుంటారు.కొన్నిసార్లు రోజులో  చాలా సార్లు తీసుకుంటారు. ఇలా చేస్తే తొందరగా తగ్గిపోతుందనేది వారి అభిప్రాయం. అయితే  ఇలా నొప్పి నివారణ మందులు ఎక్కువగా వాడితే ఏం జరుగుతుందో  వైద్యులు కింది విధంగా తెలిపారు.

నొప్పి నివారణ మందులు వాడటం తప్పనిసరి అయితే ఎటువంటి సలహా లేకుండా రోజుకు చాలా సార్లు తీసుకోవడం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. పెయిన్ కిల్లర్స్ తో సేఫ్ అనేదేమీ లేదని అంటున్నారు. ప్రతి పెయిన్ కిల్లర్ సైడ్ ఎఫెక్ట్స్ తో వస్తుంది.  ఎటువంటి సలహా లేకుండా మందులు తీసుకోవడం తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుంది.
 
రోజుకు ఎన్నిసార్లు తీసుకోవచ్చంటే..

నిపుణుల అభిప్రాయం ప్రకారం నొప్పికి ఎక్కువగా ఉపయోగించే ఔషధం పారాసెటమాల్. నొప్పులు వస్తే పారాసెటమాల్ వాడాలని పిల్లలకు కూడా తెలుసు. 8 గంటల వ్యవధిలో 500 ఎంజీ మాత్రలు రోజుకు 3-4 రోజులు  తీసుకోవచ్చని అది కూడా వైద్యుడిని సంప్రదించిన తర్వాత తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.  3-4 రోజుల కంటే ఎక్కువ తీసుకోకూడదు.

సమస్య తెలియకుండా తీసుకోకూడదు..

శరీరంలో ఉన్న సమస్య ఏంటో తెలియకుండా నొప్పి నివారణ మందులు తీసుకోవడం హానికరం. ఎందుకంటే పైన చెప్పుకున్నట్టు ప్రతి మందుకూ సానుకూల ప్రభావాలే కాదు వ్యతిరేక ప్రభావాలు కూడా ఉంటాయి. ఈ కారణంగా చాలామందిలో మెడిసిన్ రియాక్షన్ కనబడుతూ ఉంటుంది. ఒక్కోసారి దీనివల్ల ప్రాణాలమీదకు రావచ్చు కూడా.

                                       *నిశ్శబ్ద