హానీమూన్ మర్డర్..  మతలబేంటంటే?

హానీమూన్ మర్డర్.. మతలబేంటంటే?

Publish Date:Jun 11, 2025

హానీమూన్ మర్డర్ కేస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అతి పెద్ద సంచలనం. ఈ కేసు వ్యవహారంలో అనేక మలుపులు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయ్. పైకి తన ముందు అక్కా అక్కా అంటూనే లోలోపల తన సోదరిని అతడు బుట్టలో పడేశాడని వాపోతున్నాడు సోనమ్ సోదరుడు గోవింద్.  ఇంతకీ ఎవరీ   సోనమ్? ఈమె ఎవర్ని పెళ్లాడింది? తన భర్తను ఎప్పుడు హతమార్చింది? ఎవరి సాయంతో ఈ పని చేసిందన్న ప్రశ్న చాలా మందిలో ఆసక్తి రేకిస్తోంది. ఉత్కంఠ భరితమైన ఈ విషాదగాథలో నిందితులు సోనమ్- రాజ్ కుష్వాహా కాగా.. మృతుడు రాజా. రాజాకు  సోనమ్ కు మే 11న పెళ్లయ్యింది. వీరు హానీ మూన్ కి   మేఘాలయకు వెళ్లారు.  పెళ్లయిన 12 రోజులకే .. అంటే మే 23న రాజా హత్యకు గురయ్యాడు.  దీనంతటికీ కారణం 21 ఏళ్ల రాజ్ కుష్వాహాతో సోనమ్ కి ప్రేమ వ్యవహారం ఉండటమేనని తెలుస్తోంది. రాజా కుష్వాహా తన స్నేహితులతో కలసి.. రాజాను హతమార్చారని పోలీసులు విచారణలో వెల్లడైనట్టు చెబుతున్నారు.  అంతే కాదు సోనమ్ సైతం ఈ నేరం అంగీకరించినట్టు తెలుస్తోంది.  అయితే ఈ కేసులో తన సోదరి ప్రమేయం ఉన్నట్టు అధికారికంగా తెలీయడం లేదనీ, ఒక వేళ అదే నిజమైతే.. ఆమెకు తప్పకుండా ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాడు నిందితురాలు సోనమ్ సోదరుడు గోవింద్.  రాజా సోదరుడు విపిన్ తో కలసి మీడియాతో మాట్లాడిన గోవింద్ ఈ డిమాండ్ లేవనెత్తారు.  హానీమూన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు రాజా కుష్వాహా మరెవరో కాదు గోవింద్ ఫ్లై- ఉడ్ ఫ్యాక్టరీలో పీఆర్ గా పని చేస్తున్న వ్యక్తే. ఆమాటకొస్తే కుష్వాహా తన సోదరిని అక్కా అక్కా అని పిలిచేవాడని.. ఇద్దరం పక్క పక్కన ఉన్నపుడు తన సోదరి తనతో పాటు కుష్వాహాకూ రాఖీ   కట్టిందనీ గోవింద్ చెబుతున్నారు.    ఇపుడీ వ్యవహారం ఎందుకంత హాట్ టాపిగ్గా మారిందంటే.. ఇప్పటి వరకూ ప్రపంచ చరిత్రలో హానీమూన్ లో ఉండగానే ప్రియుడితో కలసి తన భర్తను మర్డర్ చేయించిన నవ వధువుగా చరిత్రకెక్కింది సోనమ్. ఒక పక్క దేశంలో భారత్- పాక్ అంటూ యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇదేదీ లెక్క చేయని ఈ ఇద్దరూ ప్రేమికులు (వీరికి మరేదైనా పేరు పెట్టాలి) తమ అడ్డు తొలగించుకోవడంలో భాగంగా ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం దారుణంగా భావిస్తున్నారు. అందుకే ఈ మర్డర్ కేసులో తన సోదరి పాత్ర నిజమైతే, ఆమెకు తప్పక మరణ శిక్ష విధించాలని కోరుకుంటున్నాడు గోవింద్. ఎందుకంటే తాను ఎప్పుడైతే తన సోదరిని రాజా ఇంటికి ఇచ్చానో అప్పటి నుంచీ ఆ కుటుంబంలో ఒక భాగం అయ్యాననీ.. అందుకే  తాను కూడా వారి పక్షమేననీ.. కాబట్టి ఆ కుటుంబానికి నా వల్ల జరిగిన అపరాధానికి తాను న్యాయం కోరుతున్నానని బోరున విలపిస్తూ చెప్పాడు గోవింద్. 
గాంధీలు జైలుకు వెడతారా?

గాంధీలు జైలుకు వెడతారా?

Publish Date:Apr 19, 2025

అవును. ఇప్పుడు ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. నేషనల్‌ హెరాల్డ్‌  మనీలాండరింగ్‌ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జి షీట్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలను ఎ1,ఎ2గా పేర్కొన్న నేపధ్యంలో  గాంధీలు జైలుకు  వెళతారా? అనే ప్రశ్న దేశంలో ప్రముఖగా వినిపిస్తోంది. మరో వంక ఈ కేసును తెర పైకి తెచ్చిన రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్య స్వామి  ఆ ఇద్దరి అరెస్ట్ తప్పదని  పూటకో టీవీ చానల్ లో ప్రవచనం చెప్పినట్లు చెపుతున్నారు. సో..సహజంగానే సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ అరెస్ట్  చేస్తుందా? అనే ప్రశ్న కాంగ్రెస్  వర్గాల్లోనే కాదు, సామాన్యులలోనూ  వినిపిస్తోందని అంటున్నారు. అయితే కావచ్చును కాంగ్రెస్  నాయకులు ఆరోపిస్తున్నట్లుగా, కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇటు బీజేపీకి అటు మోదీ నాయకత్వానికి సవాలుగా దూసుకొస్తున్న రాహుల్ గాంధీ దూకుడును అడ్డుకునేందుకే మోదీ ఈడీని ఉసిగొల్పుతున్నది నిజం కావచ్చును. కానీ  కేసు చరిత్రను  చూస్తే అసలు ఏమీ లేకుండానే  పదేళ్లకు పైగా విచారణలో ఉన్న కేసులో ఈడీ ఏ ఆధారాలు లేకుండానే ఛార్జిషీట్‌ దాఖలు చేస్తుందా? అందులోనూ  సోనియా, రాహుల్ గాంధీ పై ఛార్జిషీట్‌ దాఖలు చేసే సాహసం చేస్తుందా? అనే  సందేహాలు కూడా గట్టిగానే వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంటే.. పరిపాలనా దక్షత, అభివృద్ధి లెక్కల విషయంలో ఎలా ఉన్నా..  రాజకీయ లెక్కలు వేయడంలో తప్పుచేయని మోదీ షా జోడీ  కాంగ్రెస్ అగ్ర నేతలు ఇద్దరినీ ఒకే సారి టార్గెట్  చేస్తారా?  ఆ తప్పు మోదీ షా జోడీ చేస్తుందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.  నిజానికి  రాజకీయ నాయకుల అవినీతి బాగోతాలకు సంబందించిన కేసుల్లో చాలా చిక్కు ముళ్ళు ఉంటాయి. ముఖ్యంగా ఈ  ‘స్థాయి’ కేసుల్లో  చాలా పకడ్బందీగా, ఎక్కడా ఏ దర్యాప్తు సంస్థకూ దొరక్కుండా, పక్కా పథకం ప్రకారం పని కానిచ్చేస్తారని  అంటారు. కానీ  నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి చిక్కు ముళ్ళు పెద్దగా లేవు. అంతా  ఓపెన్ సీక్రెట్ , ఖుల్లం ఖుల్లా ..అందరికీ అర్థమయ్యేలా ఉందని  అంటున్నారు.  క్లుప్తంగా కేసు వివరాలోకి వెళితే,మూడు నాలుగు తరాల రాజకీయాలతో ముడిపడిన ఈకేసులో  గొప్పగా చిక్కు ముళ్ళు ఏమీలేవు. నెహ్రూ గాంధీల తొలి తరం నేత, స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ  1935 లో  మరో 5000 మంది వాటాదారులతో కలసి స్వాతంత్ర పోరాటంలో అక్షర ఆయుధంగా పనిచేస్తుందని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)సంస్థను స్థాపించి, ‘నేషనల్ హెరాల్డ్’ అంగ్ల పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పండిత జవహరలాల్ నెహ్రూ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్  పత్రిక కోసం ఢిల్లీ, లక్నో సహా మరికొన్ని మహానగరాలలో విలువైన స్థలాలను చౌకగా ఇచ్చారు. ఇవి కాక ఏజేఎల్ కంపెనీకి 90 లక్షల దాకా 10 రూ.విలువ గల షేర్స్ ఉన్నాయి. అంటే 9 కోట్ల మూలధనం ఉంది. అంతే కాకుండా నెహ్రూజీ మానస పుత్రికగా ముద్ర వేసుకున్న పత్రికకు  కాంగ్రెస్ ప్రభుత్వాలు విరాళాల రూపంలో,  ప్రకటనల రూపంలో ఆర్థిక సహకారం అందిస్తూ వచ్చాయి. (పత్రిక మూత పడిన తర్వాత కూడా హిమాచల ప్రదేశ్  ప్రభుత్వం, ఈ మధ్యనే రూ. 2.50 కోట్ల  ప్రకటనలు ఇచ్చినట్లు  ఈడీ చార్జి సీట్లో ఉందిట.) అయినా, కంపెనీ 2008 నాటికి, రూ.90 కోట్ల మేర అప్పుల ఊబిలో కూరుకు పోయింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక మూత పడింది. ఈ అప్పులు తీర్చడం కోసం  కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ కి రూ.90 కోట్లు అప్పు ఇచ్చింది.  నేషనల్ హెరాల్డ్  స్టొరీలో ఇదే టర్నింగ్ పాయింట్.  ఎందుకంటే.. ఒక రాజకీయ పార్టీ అప్పులు, ఇచ్చి పుచ్చుకోవదాలను చట్టం అనుమతించదు. అదొకటి అయితే.. పత్రిక మూత పడినా, దేశంలో అనేక నగరాల్లో ఉన్న ఏజేఎల్’ ఆస్తుల విలువ పడిపోలేదు.పెరింగింది.ఇప్పడు ఆస్తుల విలువ రూ. 2000 వేల కోట్ల పైమాటే అంటున్నారు.ఇంకొదరైతే రూ.5000కోట్లు అంటున్నారు. వాస్తవానికి ఈ  ఆస్తులు 2010 వరకు నెహ్రూ కుటుంబ ఆస్తులు కాదు. స్వచ్చంద సంస్థకు చెందిన ఆస్తులు.  కానీ 2010లో  సోనియా గాంధీ, రాహుల్ గాంధీచెరో 38 శాతం వాటాతో, (మిగతా 22 శాతంకు  ఆ స్కార్ ఫెర్నాండేజ్, మోతీలాల్ వోరా  వాటాదారులు) యంగ్ ఇండియా కంపెనీ తెర మీదకు వచ్చింది. అక్కడితో, సీన్ మారిపోయింది. కొత్త కంపెనీ మూలధనం కేవలం రూ.5 లక్షలు మాత్రమే అయినా.. రూ.2000 వేల కోట్ల పైబడిన  ఏజేఎల్ ఆస్తులతో పాటుగా, కంపెనీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు చెపుతున్న రూ.90 కోట్ల అప్పు ఆ నలుగురి మధ్య కుదిరిన ఒప్పందంతో, యంగ్ ఇండియాకు బదిలీ అయిపోయింది.  అక్కడితోనూ  కథ ముగియ లేదు. ఏజేఎల్  ఆస్తులు యంగ్ ఇండియాకు బదిలీ అయిపోయిన వెంటనే  కాంగ్రెస్ ఇచ్చిన రూ.90 కోట్ల అప్పు ను  కాంగ్రెస్ పార్టీ ఉదారంగా..  యంగ్ ఇండియా నుంచి జస్ట్ ఓ రూ.50 లక్షలు తీసుకుని మాఫీ చేసేసింది. మళ్ళీ  యంగ్ ఇండియా కు ఆ రూ. 50 లక్షలు ఎక్కడివంటే..  అది మళ్ళీ మరో భేతాళ కథ.  సో .. మొత్తంగా చూస్తే సామాన్యులకు కూడా అర్థమయ్యే విషయం ఏమంటే..  సోనియా,రాహుల్ గాంధీలలు ప్రధాన షేర్ హోల్డర్లుగా ఉన్న యంగ్ ఇండియా  జస్ట్ ఓ రూ.5 లక్షల పెట్టుబడితో  రూ.2000 కోట్ల పైబడిన ఏజేఎల్ ఆస్తులకు హక్కు దారు అయింది.  సో.. ఇప్పుడు ఇలా నాలుగు గోడల మధ్యా జరిగినట్లు చెపుతున్న  ఒప్పందాలలకు సంభందించి సాగుతున్న విచారణలో భాగంగానే ఈడీ, సోనియా, రాహుల్ గాంధీలను ఎ 1,  ఎ 2 గా పేర్కొంటూ  చార్జిషీట్ దాఖలు చేసింది.   నిజానికి,   2012- 2013లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ కేసు వెలుగు చూసింది. సీబీఐ విచారణ చేపట్టింది. ఆ సమయంలోనే  సోనియా, రాహుల్ గాంధీలకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇప్పటివకు వరకూ కూడా గాంధీలు ఇద్దరూ బెయిల్ పైనే ఉన్నారు. అలాగే ఈడీ కూడా గతంలో ఆ ఇద్దరినీ విచారించింది. ఇప్పడు చార్జి షీట్ దాఖలు చేసింది. అయితే, ఈడీ చార్జి షీట్ దాఖలు చేసినంత మాత్రాన వెంటనే అరెస్ట్ చేస్తుందని కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  వెంటనే అరెస్ట్ కాలేదు. అసలు అరెస్ట్ అవసరమా..  కాదా అనేది ఈడీ కాదు.. కోర్టులు నిర్ణయిస్తాయి. సో.. ఇప్పటికి ప్పుడైతే  గాంధీలు అరెస్ట్ అయ్యే అవకాశాలు అంతగా లేవనే అంటున్నారు.  బట్.. చట్టం తన పనితాను చేసుకు పోతుంది .. చట్టానికి సహకరించడం పౌరుల ధర్మం. గాంధీలు అందుకు అతీతులు కాదు. వారికి మినహాయింపూ ఉండదు. 

సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!

Publish Date:Apr 19, 2025

రేసులో పడిపోయిన ప్రతిసారీ నిలబడటమే కాదు..  పరుగెత్తి గెలవడమంటే ఆషామాషీ కాదు.. అది ఎప్పటికప్పుడు చేసి చూపిస్తున్నారు కాబట్టే చంద్రబాబుని అపర చాణక్యుడు అంటారు.  చంద్రబాబు ఏజ్ బార్ అయింది.. టీడీపీ పనైపోయంది.. రాష్ట్రంలో ఇక వైసీపీకి ఎదురే లేదని జగన్ టీం తెగ హడావుడి చేసింది. అయితే సెవెన్టీ ప్లస్ ఏజ్‌లో కూడా పొలిటికల్‌గా తాను యంగ్ టర్క్‌నని నిరుపించుకున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అత్యధిక సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి చరిత్ర సృష్టించారు.  దాంతో పాటు ఎన్డీఏ కూటమిలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించి, కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నారు. 76వ పడిలోకి అడుగుపెట్టిన ఆయన పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు.  ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం స‌ృష్టించింది. ఇక్కడ ఎన్డీఏ కూటమి అనడం కంటే. తెలుగుదేశం, జనసేనల బలమే వైసీపీని మట్టికరిపించిందనడం కరెక్ట్.ఎందుకంటే ఆ పార్టీల అండ లేకుంటే బీజేపీకి ఏపీలో ఉన్న ఉనికి నామమాత్రమే. విజనరీ లీడర్, అపరచాణక్యుడిగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సీబీఎన్ మండుటెండల్లో  ప్రచారం చేసిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇతర పార్టీల నేతలు భానుడి ప్రతాపాన్ని  తట్టుకోలేక షార్ట్ బ్రేక్‌లు తీసుకున్నారు.  కాని ఆ సూర్యుడు ఈ చంద్రుడి స్పీడ్‌కి  బ్రేక్‌లు కాదు కదా కనీసం స్పీడ్ బ్రేకర్లు కూడా వేయలేకపోయాడు. సెవెన్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్‌‌లో తొంభై సెగ్మెంట్లలో సీబీఎన్ ప్రచారం చేశారంటేనే ఆయన స్టామినా ఏంటో అర్థం అవుతుంది.  ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం.  బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్..  సౌత్ అసియన్ ఆఫ్ ద ఇయర్.. వరల్డ్ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్‌ క్యాబినెట్‌ మెంబర్.. ఇదీ విజనరీ లీడర్  చంద్రబాబుకి అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపు. ఆ విజనే రాజధాని లేకుండా విడిపోయిన ఏపీలో జరిగిన మొదటి ఎన్నికల్లో జనం చంద్రబాబుకు పట్టం కట్టేలా చేసింది. అంతర్జాతీయంగా నారావారిని ఎందరు ఎన్నిరకాలుగా ఆకాశానికెత్తేసినా,  తెలుగోళ్లకు మాత్రం అభివృద్ది కాముకుడు, అపరచాణక్యుడే.  చంద్రబాబు పేరు చెప్తే హైదరాబాద్ హైటెక్‌ సిటీకి పునాది వేసిన సైబర్ టవర్సే గుర్తొస్తాయి. అలా ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో తనదైన బ్రాండ్ వేసుకున్న సీబీఎన్. విభజిత ఆంధ్రప్రదేశ్ కు  కూడా హైదరాబాద్ స్థాయి రాజధానిని ఏర్పాటు చేస్తారనీ,  అభివ‌ృద్దిని పరుగులు పెట్టిస్తారనే 2014 ఎన్నికల్లో ప్రజలు ఆయనను నెత్తినపెట్టుకున్నారు.  అమరావతి రాజధానికి అంకురార్పణ చేసి .. రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్న టైంలో చంద్రబాబు స్పీడ్‌కి బ్రేకులు పడ్డాయి.  ఒక్క ఛాన్స్ అంటూ వైసీపీ అధ్యక్షుడు చేసుకున్న అభ్యర్ధన రాష్ట్ర స్థితిగతుల్ని మార్చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనామకంగా, అగమ్యగోచరంగా తయారైంది. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్, 14 ఏళ్లు సీఎంగా ఉన్న సీబీఎన్  రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించి అభాసుపాలయ్యారు.  చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక వైపు అమరావతి డెవలప్‌మెంట్, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పనులు పరుగులు పెట్టిస్తూనే,  పెట్టబడులు, పరిశ్రమల స్థాపనపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.  ఇప్పుడు ఏపీ, తెలంగాణ రోడ్లపై పరుగులు పెడుతున్న కియా కార్లను చూస్తే తెలుగోళ్లకు చంద్రబాబునాయుడే కనిపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన సీబీఎన్ ను  రాష్ట్ర విభజన తర్వాత మరోసారి సీఎంని చేసింది ఆ హైటెక్ విజనే.   ఆయన అమరావతి రాజధాని అనగానే జగన్‌ సహా అందరూ ఆమోదించారు. అయితే..  2019 ఎన్నికల తర్వాత ఈక్వేషన్లు మారిపోయాయి.  రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితిలో ఏపీ ప్రజలు మిగిలారు .బటన్ నొక్కుడు పాలిటిక్స్ మొదలు పెట్టిన జగన్.. సంక్షేమం డబ్బులు డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేస్తూ కొత్త ట్రెండ్ మొదలు పెట్టారు. 2024 ఎన్నికల్లో కూడా ఆ నవరత్నాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో కనిపించారు.  పైగా.. తెలుగుదేశం అధికారంలోకి వస్తే తన హయాంలోని పథకాలు అన్నీ ఆగిపోతాయని ప్రచారంలో చెప్పారు. 2014లో ఎన్డీఏ కూటమితో గెలిచిన చంద్రబాబు.  గత ఎన్నికల్లో ఆ కూటమికి దూరమై దెబ్బ తిన్నారు.  అయితే... రాష్ట్రం సంక్షేమం కోసం  జగన్  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మళ్లీ 2024 ఎన్నికలకు ముందు బీజేపీ, జనసేనలతో కలిశారు.  అయితే పేరుకి  ఎన్డీఏ కూటమి అయినా దానికి పెద్ద దిక్కు చంద్రబాబే అయ్యారు. ప్రచార  బాధ్యతను కూడా భుజ స్కంధాలపై వేసుకుని ముందుకు సాగారు. ఓవైపు ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎండగడుతూనే... తాము అధికా రంలోకి వస్తే చేసే పనులను ప్రజలకు వివరించారు చంద్రబాబు.. ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రచారం నిర్వహించారు.  నవరత్నాలని  వైసీపీ అంటే. సూపర్ సిక్స్, భవిష్యత్తుకు గ్యారెంటీ హామీలతో  చంద్రబాబు దూసుకుపోయారు.  జగన్ సర్కారు మద్యం పాలసీ, ఇసుక దందాలు, వైసీపీ నేతల అరాచకాలపై ఫైర్ అవుతూ ఎన్నికల ప్రచారంలో క్లైమాక్స్ పంచ్‌లు విసిరారు.  టీడీపీ అధినేత నవరత్నాల పేరుతో  జగన్ ప్రజలకు చాక్లెట్ ఇచ్చి.. నెక్లెస్‌లు తీసుకుంటున్నారంటూ ప్రజల్ని ఆలోచింపచే శారు చంద్రబాబు. ఎన్నికల ప్రచారాన్ని అన్నీ తానై నడిపించారు .  పని రాక్షసుడిగా టాగ్‌లైన్ తగిలించుకున్న హైటెక్ లీడర్ బర్త్ డేట్ 1950 ఏప్రిల్ 20.  14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయన వయసు ప్రస్తుతం 74 ఏళ్లు. మండు టెండల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన 90 సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం పూర్తి చేసారంటే.. మామూలు విషయం కాదని రాజకీయ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  దటీజ్ చంద్రబాబు అంటూ కితాబులిచ్చారు. . ఆయనకంటే వయస్సులో చిన్నవారైన పవన్‌కళ్యాణ్, జగన్‌.. ఎండ ధాటికి తట్టుకోలేక షార్ట్ బ్రేక్‌లు తీసుకున్నారు. కానీ.. చంద్రబాబు మాత్రం నిత్య యవ్వనుడిలా అలుపెరుగని పోరాటం చేశారు.  ఒక్కసారి కూడా బ్రేక్‌ తీసుకోకుండా,  అటు పార్టీ నేతలతో పాటు ప్రజలూ ఆశ్చర్య పడేలా చేశారు. అంతే కాదు..  రోజుకి మూడు నుంచి ఐదు సభల్లో పాల్గొంటూ జనాలతో మమేకం అయ్యారు. ప్రతి అంశాన్నీ జనాలకు చెప్పటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. మేనిఫెస్టోలో అంశాలతో పాటు జగన్ ప్రభుత్వ పనితీరుపై  తనదైనలో శైలిలో కౌంటర్లు ఇచ్చుకుంటూ వచ్చారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు, సీట్ల సర్ధుబాటు సహా అన్ని అంశాలనూ జనంలోకి తీసుకెళ్లగలిగారు.  ఓవరాల్‌గా ఈ అభివృద్ది కాముకుడు చేసిన పోరాటం ఫలించింది.  ఆయన ఊహించిన దానికంటే బెస్ట్ రిజల్ట్ లభించింది.151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలిగారు. అటు కేంద్రంలోనూ సోలో మెజార్టీకి దూరమైన బీజేపీకి దిక్కు అయ్యారు.  ఎన్డీఏ కూటమిలో రెండో పెద్దపార్టీగా అవతరించడంతో కేంద్రానికి అణిగిమణిగి ఉండాల్సిన ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది టీడీపీకి. ఆ క్రమంలో చంద్రబాబుతో పాటు ఏపీ వాసులంతా కలలుగంటున్న నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది.  అందుకే అందరి నోటా ఎన్నికల ప్రచారం తర్వాత ఒకటే మాట వినిపించింది. అదే .. సీబీఎన్ ద గ్రేట్.

బద్దకం వీడండి

Publish Date:Jun 11, 2025

చింతిస్తూ కూర్చోకుండా చింత కలిగించే విషయాలను చీపురుతో చితక్కొడదాం. అయితే ఆ చింతింప జేసే విషయాలు ఏంటో చూద్దాం.  మొదటిది 1.బద్ధకం, సోమరితనం, అలసత్వం... పేర్లు వేరైనా భావం ఒక్కటే. ఇదే నన్ను, నిన్ను, సమాజాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న రోగం. ఇదే ఎక్కువ బాధ పెడుతున్న విషయం. జపాన్ చాలా చిన్న దేశం అయినా మనకన్నా ఏంతో ఎత్తులో ఉంది. భూకంపాలు అగ్నిపర్వతాలు సునామీలు ప్రతినిత్యం పలకరిస్తున్నా అగని పోరాటం వాళ్ళది. మనం మాత్రం పనికి రాని బిగ్ బాస్ లు, కుల్లిజోకుల జబర్దస్త్ లు చూసుకుంటూ గడిపెద్ధాం.   రెండవది 2. ప్రశ్నించే దైర్యం లేక పోవడం. పక్కవాడికి అన్యాయం జరిగితే నాకేంటి నేను నా కుటుంబం బాగుంది కదా అనే భావం మన నరనరాల్లో కూరుకు పోయింది.  మూడవది 3. ఐక్యత లేక పోవడం. ముసల్మానుల కాలం నుండి తెల్లదొరల కాలం వరకు మనలోని లోపం అదే.  నాలుగవది. 4. శుభ్రత లేకపోవడం. నదులు శుభ్రంగా ఉంచలేం(జపాన్ లోని మురికి కాలువ మన యమునా నది కన్నా 10రెట్లు స్వచ్చంగా ఉంటుంది) పరిసరాలు శుభ్రంగా ఉంచలేము. మనకెందుకు ghmc వాళ్ళు వచ్చి శుభ్రం చేస్తారుగా అంటారా? పోని వాళ్ళకి ఫిర్యాదు చేశారా?? రోడ్ల మీద ఉమ్మి , చెత్త, యూరిన్ వెయ్యకుండా ఎంతమంది ఉన్నారు? ఇక వ్యవస్థను శుభ్రంగా కూడా ఉంచలెం. ఏ నాయకుడు నిజం నవాబులా వ్యవహరిస్తున్నాడో అతనికే మళ్లీ పట్టం కడతాం. ఎవడైతే కోట్ల రూపాయల అవినీతి చేస్తాడో అతన్ని నాయకుడిని చేస్తాం. విద్య, వైద్య, వివాహ... ఇలా ఎన్నో వ్యవస్థలను భ్రష్టు పట్టించాం  5. కుల మత వర్గ వర్ణ వివక్ష... ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని కులాలు, వర్ణాలు ఉండవు. మనం అంతా మనుషులమే అని మరిచి మనలో మనం కొట్టుకుచస్తా ఉంటాం. అరే వాడు మన కులపొడురా వాడికే మన ఓటు అంటాం గాని, మన బతుకులు బాగు చేసే వాడురా వాడికి ఓటు వేద్దాం అని చాలా మంది ఆలోచించం.  వీటన్నింటిలో ముఖ్యంగా ఆలోచించాల్సింది సోమరితనం గురించి. సోమరితనం రాచపుండు అని గాంధీజీ అన్నట్టు, సోమరి పోతు దేశానికే భారం.  మన భారత దేశంలో మనమే మన జాతీయ సంపద. ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన రెండవ అతిపెద్ద దేశం. అయినా ఇంకా వెనుక బడిన దేశం. ఉద్యోగాలు లేవు లేవు అని గగ్గోలు పెడతాం, కానీ ఆలోచిస్తే ఎన్ని ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెట్టీ , టీవీలు కంప్యూటర్లు సినిమాలు చూస్తూ మన విలువైన జీవితాన్ని ఏం సాధించకుండా సమాధి కట్టెద్ధాం. ఏముందీ..పుట్టాం..పెరిగాం...చదివాం...ఏదో బొడి ఉద్యోగం తెచ్చుకున్నాం, పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాం, వాళ్ళ బాగోగులు చూసాం, వాళ్ళ పెళ్లి చేశాం..ముసలి అయ్యం..ఇంకేం ఉంది...కృష్ణా రామా అనుకుంటూ గడిపెద్ధాం...ఇంతేనా చరిత్రలో మనకో పేజీ ఉందొడ్డూ??  KFC owner 60 ఏళ్ల వయసులో KFC స్థాపించారు. అది చదవడం వరకే అలాంటివి చెయ్యడానికి మనం పునుకోము . ఒక లక్ష్యం నిర్దేశించుకుని ముందడుగు వెయ్యము. అంతేగా ఈ జీవితం ◆వెంకటేష్ పువ్వాడ
[

Health

]

ప్రోటీన్ పౌడర్లు కాదు.. ఈ డ్రింక్ 15రోజులు తాగితే చాలు.. శరీరం ఉక్కులా మారుతుంది!

Publish Date:Jun 11, 2025

  ఎప్పుడూ అలసటగా,  బలహీనంగా ఉంటుందా? బద్దకంగానూ,  మోకాళ్లలో నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? వీటిని అధిగమించడానికి  జిమ్ కు వెళ్తున్నా, మార్కెట్‌లో లభించే ఖరీదైన ప్రొటీన్ పౌడర్‌లు తీసుకుంటున్నా అంత ఫిట్ గా అనిపించడం లేదా?   ఈ సమస్యలను గనుక ఎదుర్కొంటున్నట్లయితే, ప్రోటీన్ తీసుకునే విధానాన్ని మార్చుకోవాలి. నిత్యం బలహీనంగా ఉంటే శరీరంలో ప్రాణం ఉండదని, మోకాళ్లలో నొప్పులు వస్తుంటే మంచి ప్రోటీన్ అవసరం అని అర్థం. ఇంట్లోనే ఆరోగ్యకరమైన ప్రొటీన్‌ను ఎలా తయారు చేసుకోవచ్చో,  దాని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. ప్రోటీన్ పౌడర్ కు కావలసిన వస్తువులు.. 60 గ్రాముల వేయించిన శనగలు 2 ఖర్జూరాలు. 1 అపటిపండు 1 గ్లాసు పాలు  బెల్లం రుచికి సరిపడా తయారువిధానం.. ముందుగా వేయించిన శనగలను మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా తయారుచేసిన పొడిని సత్తు అని అంటారు. ఇది బీహార్ లో ఫేమస్.  ఇందులో   ప్రోటీన్, కాల్షియం,  ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ  పొడిలో అరటిపండు, ఖర్జూరం, బెల్లం, పాలు వేసి కలపాలి.  అంతే ఎంతో పోషకరమైన ప్రోటీన్ డ్రింక్ సిద్దమైనట్టే. ప్రయోజనాలు.. ఈ మిశ్రమాన్ని కేవలం 15 రోజుల పాటు తీసుకోవడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు.  బలహీనతతో బాధపడుతున్నవారు దీనిని తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రొటీన్లే కాకుండా శరీర సామర్థ్యం పెరగడానికి  అవసరమైన అన్ని పోషకాలు దీంట్లో లభిస్తాయి. ఈ శక్తివంతమైన ప్రోటీన్ డ్రింక్ లో  కాల్షియం వల్ల  కేవలం 15 రోజుల్లోనే  శరీరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. జిమ్ కు వెళ్లే అలవాటున్నా,వర్కౌట్లు చేస్తున్నా ఈ డ్రింక్  కు తీసుకుంటూ ఉంటే శరీరం దృడంగా మారుతుంది. ఎముకలు, కండరాలలో బలం పుంజుకుంటుంది. శరీరం ఉక్కులా మారుతుంది.                                                 *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...