Read more!

జగన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ.. కీలక పరిణామం

సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలపై ఆరోపణలు చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం, ఆ లేఖను బహిర్గతం చేయడం తెలిసిందే. అయితే, ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణ అంటూ సీఎం జగన్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖను బహిర్గతం చేయడంపై చర్యలు తీసుకోవాలని, జగన్ ను సీఎం పదవి నుంచి తప్పించాలని ఆ పిటిషన్లలో కోరారు.

 

కాగా, ఈ కోర్టు ధిక్కార పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుంది. ఈ పిటిషన్లపై విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్ లలిత్ కుమార్ వైదొలిగారు. ఈ పిటిషన్లకు సంబంధించి వాది, ప్రతివాదుల్లో గతంలో తాను ఒకరి తరపున వాదించానని, అందువల్ల తాను తప్పుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విచారణను చీఫ్ జస్టిస్ మరో ధర్మాసనానికి బదిలీ చేస్తారని లలిత్ కుమార్ వివరించారు.