How often do you skip "Breakfast"?

How often do you skip

Let us first understand why people skip breakfast in the first place.

1.Sometimes it is just a long-standing habit – you just never got yourself into the breakfast routine. And, since you think you have managed to get through your morning okay over a period of time, you just tell yourself you don’t really need to eat since that is your habit.

2.Maybe you are not hungry in the morning because you routinely eat an exhaustive dinner and also snack all night until bedtime.

3.Maybe you simply don’t like breakfast food or you just rely on a cup of strong tea/coffee to get you going.

4.May be you don't have enough time in the morning to plan, prepare and eat breakfast food.

What may not know is that a strong connection has been discovered between breakfast and many health-related problems!

You would have expended energy yesterday when you were awake and your body used the building materials at night to regenerate itself.

In addition, your body has also expended 1 litre of water during the night through breathing and sweating, as well as your visit to the bathroom.

So your body wakes up “empty” in the morning and, for its trillions of cells, it begs you, “please give me back all the nutrients, energy and water I have expended in the last 24 hours.”

You will also lack the mental and physical energy you need to get through your workday without a breakfast as body can't run without required fuel. Not only that, the breakfast habit is associated with better weight management and a better diet overall.

So think thrice when ever you may want to skip breakfast for any of the 4 reasons above.

Courtesy

Glow with health welness solutions

Teluguone gnews banner

చేతులు, కాళ్ళలో జలదరింపు ఉంటోందా? ఈ విటమిన్ లోపం ఉన్నట్టే..!

  కొంతమంది కూర్చొన్నప్పుడు, పడుకున్నప్పుడు  చేతులు లేదా కాళ్ళలో జలదరింపుగా ఉంటుందని కంప్లైంట్ చేస్తుంటారు. ఇది సాధారణంగా ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నరాల కుదింపు వల్ల సంభవిస్తుంది,  ఇది కాలక్రమేణా తగ్గిపోతుంది. అయితే ఇలా  జలదరింపు  ఉండటాన్ని పదే పదే..  ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా అనుభవిస్తుంటే మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జలధరింపుకు కారణం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఒక ముఖ్యమైన విటమిన్  అయిన విటమిన్ B12 లోపానికి  ప్రారంభం కావచ్చని అంటున్నారు. ఈ విటమిన్ మన నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్ బి12  లోపం  నరాలు శాశ్వతంగా  నష్టానికి గురికావడానికి కారణమవుతుంది. విటమిన్ బి12 లోపిస్తే.. చేతులు,  కాళ్ళలో జలదరింపు  ఇతర వ్యాధులకుకు కూడా సంకేతంగా ఉంటుంది. వీటిలో  మధుమేహం, విటమిన్ బి12 లోపం, నరాల నొప్పి, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, థైరాయిడ్, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ మొదలైనవి ప్రధానంగా ఉన్నాయి. అయితే   చాలా సందర్భాలలో ఇది విటమిన్ బి12 లోపం వల్ల ఎక్కువగా వస్తుంది.అసలు విటమిన్ బి12 లోపం లక్షణాలు ఎలా ఉంటాయో పూర్తీగా తెలుసుకుంటే.. విటమిన్ బి 12 ఎందుకు ముఖ్యమైనది? విటమిన్-బి12 ను కోబాలమిన్ అని కూడా పిలుస్తారు.  ఇది  శరీరానికి అవసరమైన పోషకం. దీని ప్రాథమిక విధి నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం,  వాటిని రక్షించే మైలిన్ తొడుగును ఏర్పరచడం. ఇది శరీరమంతా ఆక్సిజన్‌ను మోసుకెళ్ళే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి12 లోపం  నాడీ వ్యవస్థను,  రక్తాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. విటమిన్ బి12 లోపం  ఇతర లక్షణాలు.. విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు చేతులు,  కాళ్ళలో జలదరింపు లేదా తిమ్మిరి మాత్రమే కాకుండా శరీరంలో ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. చాలా అలసటగా,  బలహీనంగా అనిపిస్తుంది. నడుస్తున్నప్పుడు తడబడటం లేదా బాలెన్స్డ్ గా ఉండలేకపోవడం జరుగుతుంది.  తరచుగా నోటి పూతలు, లేదా నోరు, నాలుక ఎర్రగా మారడం జరుగుతుంది. చర్మం కొద్దిగా పసుపు రంగులోకి మారడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం లేదా చిరాకుగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. విటమిన్-బి12 లోపం ఎవరికి  వచ్చే ప్రమాదం ఎక్కువ.. శాఖాహారులు విటమిన్ బి12 లోపం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ విటమిన్ సహజంగా మాంసాహార ఆహారాలైన మాంసం, చేపలు, గుడ్లు వంటివాటిలో ఎక్కువ. అలాగే  పాల ఉత్పత్తులలో కూడా ఉంటుంది. వృద్ధులలో కడుపులో జీర్ణరసాలు తగ్గడం వల్ల   పోషకాల శోషణ తగ్గవచ్చు. జీర్ణ వ్యాధులైన క్రోన్'స్ వ్యాధి వంటివి ఉన్నవారికి కూడా విటమిన్ బి12 లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పరిష్కారమేంటి..? మాంసాహారులైతే, గుడ్లు, చేపలు,  మాంసాన్ని  ఆహారంలో చేర్చుకోవచ్చు. శాఖాహారులు పాలు, పెరుగు, జున్ను,  ఇతర పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు. ఫోర్టిఫైడ్ తృణధాన్యాలు, ఈస్ట్,  సప్లిమెంట్ల ద్వారా శాకాహారులు విటమిన్-బి12 పొందవచ్చు.  పైన పేర్కొన్న లక్షణాలను కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. విటమిన్-బి12 లోపాన్ని గుర్తించడానికి ఒక సాధారణ పరీక్ష నిర్వహిస్తారు.  ఈ పరీక్ష అనంతరం విటమిన్-బి12 లోపం ఉంటే.. ఆహారం,  సప్లిమెంట్లు సూచిస్తారు. *రూపశ్రీ.

నల్ల ఎండుద్రాక్ష తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసా?

  ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ద్రాక్షలో కూడా వివిధ రకాలు ఉన్నాయి. వీటిలో గ్రీన్ గ్రేప్స్,  బ్లాక్ గ్రేప్స్ తో పాటు.. ఎర్రగా ఉండే గ్రేప్స్,  చూడ్డానికి నేరేడు పండ్లలాగా పొడవుగా ఉండే గ్రేప్స్ ఇలా రకరకాలు ఉన్నాయి.  అయితే సీజన్ లోనే లభించే ద్రాక్షను ఎప్పుడైనా తినడానకి, ఆరోగ్యంగా ఉండటానికి డ్రై ఫ్రూట్ రూపంలో తీసుకుంటారు. వీటిలో ఒకటైన నల్ల ఎండు ద్రాక్ష గురించి చాలామందికి తెలియదు. చాలామంది గ్రీన్ ఎండు ద్రాక్షనే తింటుంటారు. కానీ నల్ల ఎండుద్రాక్ష గురించి, దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.  ఇంతకీ నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. ఎముకల బలం.. నల్ల ఎండు ద్రాక్షలో బోరాన్ ఉంటుంది.  ఇది ఆరోగ్యకరమైన, బలమైన ఎముకలకు చాలా మంచిది.  ఇది బాగా సహాయపడుతుంది. వీటిని రెగ్యులర్ గా కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల అస్థియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారించవచ్చు. చర్మ వ్యాధులు.. నల్ల ఎండుద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.  ఇవి చర్మ వ్యాధులను,  బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు.. నల్ల ఎండుద్రాక్ష తింటే అధిక రక్తపోటు తగ్గుతుంది. వీటిలో ఉండే ఫైబర్,  పొటాషియం,  పాలీ ఫెనాల్స్ రక్తపోటును సాధారణంగా ఉంచడంలో సహాయపడతాయి. రక్తహీనత.. సాధారణంగా రక్తహీనతతో ఇబ్బంది పడేవారికి గ్రీన్ ఎండుద్రాక్ష,  ఖర్జూరం తినమని సలహా ఇస్తుంటారు. వాటితో పాటు నల్ల ఎండుద్రాక్ష కూడా తినవచ్చు.  నల్ల ఎండుద్రాక్షలో ఐరన్ కంటెంట్ బాగుంటుంది.  ఇది రక్తహీనతను తగ్గించడానికి,  శరీరంలో హిమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడుతుంది. రెగ్యులర్ గా నల్ల ఎండుద్రాక్ష తీసుకుంటూ ఉంటే శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ .. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా  ఉంటే అది గుండె,  కాలేయం, రక్తనాళాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.  ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం కూడా ఉంటుంది.  అయితే నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్  కు చెక్ పెట్టవచ్చు.  నల్ల ఎండుద్రాక్షలో పాలీ ఫెనాల్స్ అధికంగా ఉంటాయి.  ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇమ్యూనిటీ.. నల్ల ఎండుద్రాక్ష రోగనిరోధక శక్తని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. నల్ల ఎండుద్రాక్షలో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు  శరీర రోగనిరోధక శక్తిని  పెంచడంలో సహాయపడతాయి. హెయిర్ ఫాల్.. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యల్లో హెయిర్ ఫాల్ ఖచ్చితంగా ఉంటుంది.  హెయిర్ ఫాల్ తో ఇబ్బంది పడేవారు నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టవచ్చు.  ఇందులో ఉండే ఐరన్, విటమిన్-సి వంటి లక్షణాలు జుట్టు రాలడాన్నిఆపుతాయి.  అంతేకాదు.. జుట్టు ఆరోగ్యంగా పెరగడంలోనూ, జుట్టు  నల్లగా ఉండటంలోనూ సహాయపడతాయి.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

చేత్తో ఆహారం తినాలని పెద్దలు చెప్పేది ఇందుకే..!

  భారతీయులు భోజన ప్రియులు అనే మాట అందరికీ తెలిసిందే.. భారతదేశంలో ఉన్నన్ని ఆహార రకాలు మరే ఇతర దేశాలలోనూ ఉండవు. అయితే ఆహారాన్ని తినడంలో చాలా మార్పులు వచ్చాయి.  చాలా దేశాలలో ఆహారం తినడానికి స్పూన్లు, ఫోర్క్ లు,  చోప్ స్టిక్స్ వంటివి వాడతారు. అయితే భారతదేశంలో మాత్రం చాలా ఏళ్ల నుండి చేత్తో  ఆహారం తినేవారు. కానీ పాశ్చాత్య సంస్కృతి ఇలా చేతులతో ఆహారం తినడాన్ని అనాగరిక అలవాటుగా రూపొందిస్తూ వచ్చింది. దీంతో చేత్తో తినగలిగే ఆహారాలు కూడా చాలా మంది స్పూన్లతోనూ, పోర్కులతోనూ తింటున్నారు. అయితే చేత్తో ఆహారం తింటే కలిగే లాబాలేంటి? అనే విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. తినడం అంటే కడుపు నింపుకోవడం మాత్రమే కాదు. ఇది శరీరం, మనస్సు,  ఆత్మను అనుసంధానించే అనుభవం. ఈజిప్ట్, మెసొపొటేమియా,  గ్రీస్ వంటి ప్రాచీన నాగరికతలు కూడా తినడానికి  చేతులనే ఉపయోగించాయి. భారతదేశంలో చేత్తో ఆహారం తినడం అనే సంప్రదాయం ఆయుర్వేద మూలాలను కలిగి ఉంది.   చేతులు పంచభూతాలకు  ప్రతినిధులుగా పరిగణించబడతాయి. చేతులతో తినడం వెనుక ప్రాముఖ్యత..  చేతులతో తినడం అనే సంప్రదాయం శతాబ్దాల నాటిది. ఆయుర్వేదంలో..  బొటనవేలు అగ్ని తత్వం, చూపుడు వేలు వాయు తత్వం, మధ్య వేలు ఆకాశం, ఉంగరపు వేలు భూమి,   చిటికెన వేలు నీరు అనే గుణాలను నింపుకుని ఉంటాయి.  ఇవన్నీ పంచభూతాలు అనబడతాయి.  చేతులతో తినేటప్పుడు ఇవన్నీ  సక్రియం చేయబడతాయి. శరీర శక్తిని సమతుల్యం చేస్తాయి. చేతులతో ఆహారాన్ని తాకడం వల్ల ఆహారం వడ్డించబోతున్నట్లు మెదడుకు సంకేతాలు అందుతాయి. ఇది లాలాజలం,  జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.  ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ప్రయోజనాలు..  చేతులతో తినడం వల్ల ఆహారం  ఆకృతి, ఉష్ణోగ్రత,  స్థిరత్వాన్ని అనుభూతి చెందడానికి వీలు ఉంటుంది. ఇది  నెమ్మదిగా తినడానికి,  అతిగా తినడం నివారించడానికి సహాయపడుతుంది. తద్వారా బరువు నిర్వహణకు సహాయపడుతుంది.   జీర్ణక్రియను ప్రభావితం చేసే కార్టిసాల్  అనే ఒత్తిడి హార్మోన్ ను తగ్గిస్తుంది. లాలాజల ఉత్పత్తికి సహాయపడటం వల్ల జీవశక్తిని పెంచుతుంది.  ఆయుర్వేదంలో లాలాజలాన్ని జీవశక్తిని పెంచే ఎంజైమ్ గా పిలుస్తారు.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

చిలకడదుంప ఎందుకు తినాలో చెప్పే నిజాలు ఇవి..!

  ఆహారమే ఆరోగ్యం అంటారు. నేచురల్ ఫుడ్స్ ఎప్పుడూ శరీరానికి శక్తిని,  రోగనిరోధక శక్తిని కూడా ఇస్తాయి. శరీరానికి ఔషదంగా కూడా పనిచేస్తాయి. ఇలాంటి నేచురల్ ఫుడ్స్ లో కూరగాయలు, పండ్ల ప్రాధాన్యత ఎక్కువ. అటు దుంప కూరగాయగా పరిగణించబడుతూ ఇటు నేరుగా తినగలిగేది చిలకడదుంప.  దీన్ని స్వీట్ పొటాటో అని పిలుస్తారు.  చిలకడదుంపను కాల్చి,  ఉడికించి లేదా నేరుగా పచ్చిగా కూడా తింటుంటారు. చిలకడదుంపను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలి అంటుంటారు. అయితే ఎందుకు తినాలో చెప్పే కొన్ని నిజాలు తెలుసుకుంటే.. చిలకడదుంపను తినడానికి మరింత ఇష్టపడతారు.  చిలకడదుంప ఎందుకు తినాలంటే.. బ్లడ్ షుగర్ కంట్రోల్.. చిలకడదుంప  రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ ఉంచడానికి  సహాయపడతాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ విలువ 44 నుండి 96  వరకు ఉంటుంది. ఇవి మితంగా తింటే  డయాబెటిస్ ఉన్నవారికి అనుకూలంగా ఉంటాయి. మాంగనీస్ కంటెంట్ కార్బోహైడ్రేట్ జీవక్రియకు సహాయపడుతుంది. చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, షుగర్ సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు.. చిలకడదుంపలలో  ఫైబర్ కంటెంట్ సమృద్దిగా ఉంటుంది.  ఈ కారణంగా ఇవి జీర్ణక్రియకు చక్కగా సహాయపడతాయి. చిలకడదుంపలో  పెక్టిన్ వంటి కరిగే ఫైబర్ (15-23%),  సెల్యులోజ్,  లిగ్నిన్తో సహా కరగని ఫైబర్ (77-85%) కూడా కలిగి ఉంటాయి. పెద్ద వ్యాధులను నివారించడానికి రోజూ 21-38 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. గుండెకు మంచిది.. చిలకడదుంపలలోని విటమిన్ బి 6 శరీరంలో హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. హోమోసిస్టీన్ స్థాయిలు ఎక్కువ ఉంటే   గుండెపోటు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.  ఇక చిలకడదుంపలోని  పొటాషియం కంటెంట్ ద్రవ సమతుల్యతను నిర్వహించడానికి,  రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి బూస్టర్లు.. ఆంథోసైనైడ్లు,  కోలిన్ వంటి శోథ నిరోధక సమ్మేళనాలు ఉండటం వల్ల చిలకడదుంపలు తింటే  రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఐరన్ కంటెంట్ ఒత్తిడి నిరోధకతను అందించడంలో సహాయపడుతుంది, ఎరుపు,  తెలుపు రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.  రోగనిరోధక పనితీరును నియంత్రిస్తుంది. క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చు.. చిలకడదుంపలలో యాంటీ క్యాన్సర్  లక్షణాలు ఉంటాయి.  వీటిలో అద్బుతమైన  యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఉంటుంది. ముఖ్యంగా కెరోటినాయిడ్లు ఉంటాయి.  ఇవి  కడుపు, మూత్రపిండాలు,  రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని కనుగొనబడింది. ఊదా రంగు   చిలకడదుంపలలో  ప్రత్యేకంగా బ్లూబెర్రీలలో లభించే యాంటీఆక్సిడెంట్ల కంటే మూడు రెట్లు ఎక్కువ కెరోటినాయిడ్లు ఉంటాయి.                                   *రూపశ్రీ.

గోళ్లపై తెల్లని మచ్చలుంటే ఈ వ్యాధులున్నాట్టే..!

  గోళ్లపై తెల్లని మచ్చలు కనిపిస్తున్నాయా? అలా అయితే జాగ్రత్తగా ఉండాలి. ఈ గుర్తులు వివిధ రకాల వ్యాధులకు సంకేతం కావచ్చని వైద్యులు అంటున్నారు. వివిధ వ్యాధులను ముందుగానే సూచించగల శరీర భాగాలలో గోళ్లు ఒకటి. గోళ్ల మీద మచ్చల ద్వారా వ్యాధులను గుర్తిస్తే.. వ్యాధులకు  సకాలంలో చికిత్స పొందవచ్చు. చాలా మంది దీన్నిలైట్ గా తీసుకుంటారు. కానీ గోళ్ల మీద ఎలాంటి మచ్చలుంటే.. ఎలాంటి జబ్బులు రావచ్చు అనే విషయాన్ని తెలుసుకుంటే.. ఏ వ్యాధికి సంకేతం  గోళ్లపై తెల్లని మచ్చలు కనిపిస్తే, అది జింక్ లోపాన్ని సూచిస్తుంది. జింక్  శరీరానికి ఎంతో అవసరమైన ఖనిజం. ఇది రోగనిరోధక వ్యవస్థ, కణ విభజన,  చర్మ ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. లోపం వల్ల గోళ్లపై తెల్లని మచ్చలు రావడమే కాకుండా, అనేక ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. జింక్ లోపంతో పాటు, ల్యూకోనిచియా కూడా ఒక కారణం కావచ్చు. ఇది గోరు ప్లేట్ తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. దీని వల్ల కూడా గోరు రంగు గణనీయంగా మారే పరిస్థితి ఉంటుంది. కారణాలు ఏమిటి మానిక్యూర్ యొక్క దుష్ప్రభావాలు కొన్నిసార్లు  మానిక్యూర్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇలా సంభవించవచ్చు. ఈ పరిస్థితిలో గోరు చుట్టూ ఉన్న చర్మానికి నష్టం జరుగుతుంది. దీనిని నెయిల్ బెడ్ అని పిలుస్తారు. గోళ్లపై తెల్లటి మచ్చలు లేదా గుర్తులు కనిపించవచ్చు, ఇది గోళ్లు బలహీనపడుతున్నాయనడానికి సంకేతం. ఫంగల్ ఇన్ఫెక్షన్ గోళ్లపై తెల్లని మచ్చలు ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తాయి. ధూళి ఉన్న వాతావరణంలోకి ఎక్కువ  వచ్చినప్పుడు, సూక్ష్మక్రిములు  గోళ్లలోకి లేదా చుట్టుపక్కల చర్మంలోని పగుళ్లలోకి వివిధ మార్గాల ద్వారా చేరుతాయి. ఫలితంగా వచ్చే ఇన్ఫెక్షన్  గోళ్లు తెల్లగా మారడానికి కారణమవుతుంది. ఈ స్థితిలో, గోళ్లు పసుపు రంగులోకి మారవచ్చు, పెళుసుగా మారవచ్చు. మందులు వివిధ వ్యాధుల చికిత్సకు అనేక రకాల మందులను ఉపయోగిస్తాము. వీటిలో కొన్ని గోర్లు తెల్లబడటానికి కారణమవుతాయి, దీనివల్ల తెల్లటి గీతలు కనిపిస్తాయి. అవి నెమ్మదిగా గోళ్ల పెరుగుదల, సన్నబడటం , పెళుసుగా మారడం వంటి వివిధ సమస్యలను కూడా కలిగిస్తాయి. క్యాన్సర్‌కు అత్యంత ప్రభావవంతమైన మందులలో కీమోథెరపీ, రెటినాయిడ్స్, సల్ఫోనామైడ్‌లు , క్లోక్సాసిలిన్ ఉన్నాయి. విషపూరిత లోహం కొన్నిసార్లు గోళ్లు తెల్లబడటం అనేది ఒక వ్యాధి వల్ల కాకపోవచ్చు.కానీ అనేక ఇతర కారణాల వల్ల కావచ్చు. ఉదాహరణకు, ఆర్సెనిక్ , థాలియం వంటి విషపూరిత లోహాలకు గురికావడం వల్ల కూడా గోళ్లు తెల్లబడటం జరుగుతుంది. మీస్ లైన్స్ అని పిలువబడే తెల్లటి బ్యాండ్లు కనిపించడం వల్ల కూడా ఈ రంగు మారవచ్చు. అయితే కలుషితమైన ఆహారం తినడం లేదా పారిశ్రామిక ప్రాంతంలో నివసించడం కూడా ఈ సమస్యకు దోహదం చేస్తుంది. వైద్యుడిని ఎప్పుడు చూడాలి గోళ్ల తెల్లటి రంగు ఎప్పుడూ ప్రమాదకరం కాదు, కొన్నిసార్లు ఇది సాధారణ పరిస్థితి కావచ్చు. కానీ  కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి, తెల్లటి మచ్చలు ఎక్కువ కాలం కొనసాగితే, గోళ్ల రంగు గణనీయంగా మారుతుంది, అవి బలహీనంగా మారతాయి , రాలిపోవడం ప్రారంభిస్తాయి . దీనితో పాటు, శరీరంలో అలసట , ఇతర లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాలలో వైద్యుడిని సంప్రదించాలి. గోళ్ల మీద తెల్లని మచ్చలు అనేది ఇది శరీరంలో జింక్ లోపం లేదా తీవ్రమైన కాలేయ సంబంధిత సమస్యకు సంకేతం కావచ్చు. అందువల్ల, అలాంటి పరిస్థితి మళ్లీ మళ్లీ కనిపిస్తే చర్మ వైద్యుడిని సంప్రదించాలి.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

డార్క్ చాక్లెట్ తింటే ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుందా?

  డార్క్ చాక్లెట్ అనేది చాలా తక్కువ మంది మాత్రమే ఇష్టపడే రుచికరమైన చాక్లెట్. ఇది మిగిలిన చాక్లెట్లతో పోలిస్తే కాస్త చేదు రుచి కూడా కలిగి ఉంటుంది. డార్క్ చాక్లెట్ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చాలా మంది అనుకుంటారు.  కానీ పరిశోధనల ప్రకారం డార్క్ చాక్లెట్ వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. చాలా ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి ఏమిటంటే.. ఇది  కాలేయానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. డార్క్ చాక్లెట్‌ను మితంగా తీసుకోవడం వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ప్రమాదాన్ని తగ్గించవచ్చట. ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాల్ తీసుకోకపోయినా కాలేయ కణాలలో అదనపు కొవ్వు పేరుకుపోయే పరిస్థితి. ఇది కాలేయ వాపు,  ఇతర సమస్యలకు దారితీస్తుంది. డార్క్ చాక్లెట్‌లో పాలీఫెనాల్స్,  ఫ్లేవనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.   శోథ నిరోధక లక్షణాలను అందిస్తాయి. ఇవి కాలేయ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.  ఎందుకంటే కొవ్వు కాలేయం తరచుగా ఆక్సీకరణ ఒత్తిడి, వాపుతో ముడిపడి ఉంటుంది. అధిక కోకో డార్క్ చాక్లెట్‌ను మితమైన మొత్తంలో తినేవారిలో కాలేయ ఎంజైమ్ స్థాయిలు మెరుగుపడ్డాయని పరిశోధనలు చెబుతున్నాయి.  కాలేయ ఎంజైమ్ లు కాలేయం నష్టపోవడానికి కారణం అవుతుంది. అయితే.. డార్క్ చాక్లెట్ దీనికి సహాయపడుతుంది.  కాలేయాన్ని కాపాడుతుంది. డార్క్ చాక్లెట్ ఎలా పనిచేస్తుంది.. డార్క్ చాక్లెట్  ప్రధాన మూలం ఫ్లేవనోల్స్ అని పిలువబడే దాని బయోయాక్టివ్ సమ్మేళనాలు. ఇవి అనేక విధాలుగా పనిచేస్తాయి. మొదట అవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. కాలేయ కణాలను ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తాయి. అదనంగా ఈ సమ్మేళనాలు శరీరంలోని తాపజనక మార్గాలను నిరోధిస్తాయి. కాలేయ వాపును తగ్గిస్తాయి. ఇంకా కొన్ని పరిశోధనలు డార్క్ చాక్లెట్ ఇన్సులిన్ సెన్నిటివిటిని  మెరుగుపరుస్తుందని సూచిస్తున్నాయి, ఇది కొవ్వు కాలేయానికి ప్రధాన కారణాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే డార్క్ చాక్లెట్ ద్వారా సరైన ఫలితాలు కావాలంటే 70శాతం కోకో ఉన్న డార్క్ చాక్లెట్ తినడం మంచిది. అట్లాగే.. డార్క్ చాక్లెట్ మంచిదని ఎక్కువ మొత్తం తినకూడదు. దీన్ని మితంగా తినాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. డార్క్ చాక్లెట్ అనేది ఫ్యాటీ లివర్ తగ్గడానికి సహాయపడే ఒక ఆహారం. దీన్ని మిగిలిన ఆహారాలలో బాగంగా చూడాలి.  అంతేకానీ దీంతోనే సమస్య తగ్గుతుంది అనుకోకూడదు. వైద్యానికి ఇది ప్రత్యామ్నాయం కాదు.                                *రూపశ్రీ.  

లొట్టలు వేసుకుంటూ తినే మయోనైస్ గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

ఒకప్పుడు  స్నాక్స్ అంటే చెగోడిలు, పప్పు చెక్కలు,  జంతికలు, బూంది, మిక్చర్.. ఇలా చాలా ఆహార పదార్థాలు ఉండేవి. ఆ తరువాత వీటి స్థానంలో చాలా రకాల విదేశీ ఆహారాలు వచ్చి చేరాయి. పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్,  బర్గర్, శాండ్విచ్,  పిజ్జా, మోమోస్,  రోల్స్.. ఇలా  చాలా రకాల తినుబండారాలు వచ్చి చేరాయి. ఈ స్నాక్స్ ను సాధారణంగా టమోటా కెచప్,  మయోనైస్ వంటి వాటితో తింటుంటారు.  మయోనైస్ అనేది చాలా మందికి పేవరేట్ గా మారిపోయింది. దీని రుచి దీన్ని  పదే పదే తినాలని అనిపించేలా చేస్తుంది. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదేనా? దీని గురించి తెలుసుకుంటే.. మయోనైస్ గుణం.. మయోనైస్ ప్రధానంగా నూనె, గుడ్డు పచ్చసొన,  వెనిగర్ లేదా నిమ్మరసం వంటివాటితో తయారు చేస్తారు. ఇందులో దాదాపు 80 శాతం నూనె ఉంటుంది.  ఇది ఒక రకమైన వంట నూనెగా మారుతుంది. నూనె సాధారణంగా మండుతుంది. కాబట్టి మయోనైస్ కూడా మండే పదార్థం. దాని మండే సామర్థ్యం నూనె కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఇది ప్రమాదకరం కావచ్చని అంటున్నారు. ముఖ్యంగా మయోనైస్ తయారీలో పచ్చి గుడ్డు సొనను ఉపయోగించడం వల్ల ఇది ఫుడ్ పాయిజన్ కు గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మయోనైస్ విషయంలో కొన్ని జాగ్రత్తలు చాలా ముఖ్యం.. మయోనైస్ ను మంటలకు దూరంగా ఉంచాలి.  వేడిగా ఉన్న ప్రదేశానికి కూడా దూరంగా ఉంచాలి. మయోనైస్ ను చల్లని ప్రదేశాలో, గాలి చొరబడని కంటైనర్ లలో ఉంచాలి. మయోనైస్ ను ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తే.. ఎక్కువ వేడి మీద ఉన్నప్పుడు, సడన్ గా మంట పెంచి ఉపయోగించడాన్ని నివారించాలి. చల్లగా ఉన్న  స్నాక్స్ లేదా గోరువెచ్చగా ఉన్న స్నాక్స్ మీద మయోనైస్ ఉపయోగించడం మంచిది.   ఇందులో నూనె శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం బాగుండాలంటే.. అసలు మయోనైస్ ను తినకపోవడమే బెస్ట్.                                      *రూపశ్రీ.

లవంగాలను నీటిలో మరిగించి తాగితే ఏమవుతుంది?

  వంటింటి మసాలా దినుసుల్లో లవంగాలు చాలా ముఖ్యమైనవి. లవంగాలను చాలా ఆహార పదార్థాల తయారీలోనూ, మసాలా పొడుల తయారీలోనూ ఉపయోగిస్తారు. రోజుకు ఒక లవంగం నమిలి తినడం చాలా మంచిదని చెబుతుంటారు. అయితే లవంగాలను నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. ఇంతకీ.. లవంగాలను నీటిలో మరిగించి తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..   లవంగాల నీరు.. ఒక గ్లాసు నీటిలో 4 నుండి 5 లవంగాలు వేసి బాగా మరిగించాలి.  ఈ నీరు గోరు వెచ్చగా అయ్యాక ఆ నీటిని తాగాలి.  ఈ నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. ఈ పానీయం శరీరాన్ని వివిధ రకాల ఆరోగ్య సమస్యల నుండి రక్షించడంలో,  ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడుతుంది.   ప్రయోజనాలు.. లవంగాలు మరిగించిన నీరు జీర్ణ ఎంజైమ్ ల స్రావాన్ని పెంచుతుంది. ఇది గ్యాస్,  ఆమ్లతత్వం, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. లవంగాలలో యూజెనాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు చాలా ప్రసిద్ధి చెందినది.  లవంగాలను మరిగించిన నీరు తాగితే శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దీని వల్ల జలుబు, దగ్గు, వైరల్ ఇన్పెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. లవంగాల నీరు అద్బుతమైన మౌత్ వాష్ గా పనిచేస్తుంది. నోటి దుర్వాసన కలిగించే బ్యాక్చీరియాను  తొలగిస్తుంది. పంటి నొప్పిని తగ్గిస్తుంది, వాచిన చిగుళ్ల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. లవంగాలు మరిగించిన నీరు జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో  సహాయపడుతుంది. అంతేకాదు.. బరువు నిర్వహించడంలో కూడా ఇది సహాయపడుతుంది.   - రూపశ్రీ  

ఈ లక్షణాలు ఉంటే ప్రోటీన్ లోపం ఉన్నట్టే..!

ప్రోటీన్ మన శరీరానికి అత్యంత అవసరమైన మాక్రోన్యూట్రియెంట్లలో ఒకటి. దీనిని  "శరీర నిర్మాణ పదార్థం" అని పిలుస్తారు. ఇది ఆరోగ్యకరమైన కండరాలు, చర్మం, జుట్టు,  ఎముకలకు సహాయపడుతుంది. అలాగే హార్మోన్లు,  ఎంజైమ్‌ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, భారతదేశంలో ప్రోటీన్ లోపం తీవ్రమైన సమస్యగా మారడం ఆందోళన కలిగించే విషయం. నేటి బిజీ జీవనశైలి,  అసమతుల్య ఆహారం కారణంగా చాలా మంది ప్రోటీన్ లోపాన్ని ఎదుర్కొంటున్నారు. భారతదేశంలోని పట్టణ జనాభాలో 73% మంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు. వీరిలో  93% మందికి రోజుకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలో తెలియదు. మరికొంతమందికి అసలు తమకు ప్రోటీన్ లోపం ఉన్నట్టే తెలియదు. అసలు ప్రోటీన్ లోపిస్తే కనిపించే లక్షణాలు ఏంటి? దీన్ని అధిగమించడానికి ఏం చేయాలి? తెలుసుకుంటే.. చర్మం, జుట్టు,  గోళ్ళపై ప్రభావాలు.. శరీరంలో ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు దాని ప్రభావం మొదటగా  చర్మం, వెంట్రుకలు,  గోళ్లపై కనిపిస్తాయి. జుట్టు సన్నగా మారడం, జుట్టు ఎక్కువగా  రాలిపోవడం,  చర్మం పొడిగా, నిర్జీవంగా మారడం,   గోళ్ల మీద పొట్టులాగా రావడం  లేదా పెళుసుగా మారి చిన్న ఒత్తిడికే విరిగిపోవడం వంటివి జరుగుతాయి.   శరీరం ముఖ్యమైన అవయవాలకు రవాణా చేస్తూ చర్మం, జుట్టు, గోళ్లకు ప్రోటీన్ సరఫరా చేయడం తగ్గిస్తుంది. అందుకే ఇలా జరుగుతుంది. కండరాల నొప్పులు,  కీళ్ల నొప్పి.. ప్రోటీన్ లోపం నేరుగా కండరాలను ప్రభావితం చేస్తుంది. శరీరం శక్తి కోసం కండరాల కణజాలాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా కండర ద్రవ్యరాశి తగ్గుతుంది. ఇది బలహీనత,  కీళ్ల నొప్పులకు దారితీస్తుంది. ఎక్కువ  శారీరక శ్రమ చేయకపోయినా  కూడా కండరాల నొప్పి ఉంటే అది ప్రోటీన్ లోపమయ్యే అవకాశం ఎక్కువ. శరీరంలో వాపు.. తీవ్రమైన ప్రోటీన్ లోపం శరీరంలో.. ముఖ్యంగా పొట్ట, కాళ్ళు,  చేతుల్లో వాపుకు కారణమవుతుంది. ఈ పరిస్థితిని ఎడెమా అంటారు. ఇది రక్తంలో అల్బుమిన్ అనే ప్రోటీన్ లేకపోవడం వల్ల సంభవిస్తుంది. ఇది రక్త నాళాలలో ద్రవాన్ని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఈ లోపం కణజాలాలలో ద్రవం పేరుకుపోవడానికి కారణమవుతుంది. ఇది వాపుకు దారితీస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి,  అనారోగ్యం.. మనిషిలో  రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ప్రతిరోధకాలు ప్రోటీన్ నుండి తయారవుతాయి. ప్రోటీన్ లోపం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఒక వ్యక్తి తరచుగా ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలకు గురవుతుంటే ప్రోటీన్ లోపం వల్లనే అనేది అర్థం చేసుకోవాలి. తరచుగా జలుబు లేదా ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే   అది ప్రోటీన్ లోపానికి సంకేతం కావచ్చు. దీనిని నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదం.                        *రూపశ్రీ.

మెంతులు, సొంపు వాటర్.. ఇది చేసే మ్యాజిక్ తెలిస్తే షాకవుతారు..!

  వంటగదిలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో మెంతులు,  సోంపు ముఖ్యమైనవి.  మెంతులు ఆహార పదార్థాలకు మంచి సువాసనను ఇస్తాయి. ఇక సొంపు మసాలా వంటల్లో ఉపయోగించడమే కాకుండా భోజనం తరువాత కాసింత నోట్లో వేసుకుంటూ ఉంటారు. దీని వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని, తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని చెబుతారు. అయితే ఈ రెండింటి కాంబినేషన్ తో తయారు చేసే వాటర్ మాత్రం చాలా అద్భుతాలు చేస్తుంది. ఈ మెంతి, సొంపు వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.. మెంతులు,  సోంపు నీరు జీవక్రియను వేగవంతం చేస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తాగడం వల్ల కొవ్వును కరిగించి క్రమంగా బరువు తగ్గుతారు. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.. ఈ నీటిని తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్,  అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  కడుపును తేలికగా ఉంచుతుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.. మెంతులు రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి.  సోంపు గింజలు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.. మహిళలకు మెంతులు,  సోంపు నీరు హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది ఋతు క్రమం సరిగా లేకపోవడాన్ని  సరి చేస్తుంది. అలాగే నెలసరి సమయంలో వచ్చే  నొప్పిని తగ్గిస్తుంది. చర్మం,  జుట్టుకు ప్రయోజనకరమైనది.. మెంతులు,  సొంపు  నీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి, చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.  జుట్టును బలోపేతం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. సోంపు,  మెంతులు రెండూ యాంటీ బాక్టీరియల్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. అవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.  వ్యాధుల నుండి రక్షిస్తాయి. ఎలా తయారు చేయాలంటే.. ఒక టీస్పూన్ మెంతులు,  ఒక టీస్పూన్ సోంపును రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం నీటిని కొద్దిగా వేడి చేసి వడకట్టి, ఖాళీ కడుపుతో నెమ్మదిగా త్రాగాలి.                                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...