Read more!

ఘనంగా ప్రారంభమైన వైమానికదళ వార్షికోత్సవం...

 

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వైమానికదళ 84వ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 55 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద ఇండన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో  సైనికులు ప్రదర్శించిన ఆకాశగంగ, పారా జంపింగ్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వాయుసేనాధిపతి అరూప్‌ రాహా వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొని గౌరవవందనం స్వీకరించారు. వైమానిక దళ దినోత్సవానికి ఆర్మీచీఫ్‌ దల్బీర్‌సింగ్‌, మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌, సైనిక అధికారులు, భారీగా ప్రజలు హాజరయ్యారు.