వరాహ అవతారం వెనుక వాస్తవం!

నవగ్రహాలను, భూమిని దైవంగా కొలిచే సంస్కృతి మనది. గ్రహాల్లోనూ, నక్షత్రాల్లోనూ, ప్రకృతిలోనూ, ఈ సమస్త భూగోళమంతా దైవశక్తులతో నిండిపోయిందని మన ధర్మం చెప్తోంది. ఒకానొక సమయంలో భూగోళం తనపట్టు తప్పింది. భూభాగం క్రుంగిపోయింది. దానికితోడు అంతరిక్షంలో తన కక్ష్య నుండి ప్రక్కకు జరిగింది. దీనితో మన భూమిని నిత్యం రక్షిస్తూ ఉండే ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు మొదలైన దేవతలందరూ భయబ్రాంతులకు గురై, శ్రీ మహావిష్ణు వద్దకు పరుగు పరుగున వెళ్ళి భూగోళాన్ని కాపాడమని వేడుకున్నారు.

వారి ప్రార్ధనలు మన్నించి శ్రీ మహావిష్ణువు, తన భార్యైన భూదేవిని రక్షించడానికి వరహ ఆవతారం స్వీకరించారు. తన కోరల మీద భూమిని నిలిపి, అంతరిక్షంలో తన కక్ష్యలో తిరిగి నిలిపారు. అలాగే క్రుంగిపోయిన భూభాగాన్ని తిరిగి మామూలు స్థానానికి తీసుకువచ్చారు. ఈ విధంగా చేయడం వలన స్వామిని ఒక హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఎదురించాడు. వాడిని హతమార్చి స్వామి తిరిగి అంతర్ధానమయ్యారు.అందుకే వరహామూర్తిని అర్చించాలి, ఆయనకు కనీసం నమస్కరించాలి.

భూమి మీద సహజవనరులు ఉన్నాయి. అనేక నిధినిక్షేపాలు, లోహాలు భూమిలో ఉన్నాయి. వాటిని విపరీతంగా, సంపూర్తిగా వాడుకోవడం వలన జరిగేది వినాశనమే.  అందుకే భూమాత తన పట్టు తప్పి, ప్రక్కకు జరిగింది. తన భూమిని కాపాడుకోవడానికి శ్రీ మహావిష్ణువు వరహ అవతారం ఎత్తాడు. ఇప్పుడు కూడా ప్రపంచంలో అదే జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్రగర్భంలో ఉన్న సహజవాయువును, చమురును అతిదారుణంగా మొత్తం బయటకు తీసివేస్తున్నారు. రాబోయే 10-20 సంవత్సరాలలో ఈ భూమి మొత్తం ఏ వనరులు లేకుండా మిగిలితుందని నివేదికలే మొత్తుకుంటున్నాయి. ఇటువంటి సమయమలో ఈ వరహ మూర్తి కధను మనం గుర్తుపెట్టుకుని మన భూమిని, సహజవనరులను కాపాడుకోవలసిన అవసరం ఉంది. లేకుంటే శ్రీ మహావిష్ణు ఆగ్రహానికి గురికావలసి ఉంటుంది.

వరాహ అవతారం ఒకే కల్పంలో రెండు వేర్వేరు మన్వంతరాలలో వచ్చింది !! ఆ కల్పం ప్రస్తుత శ్వేతవరాహ కల్పం మరియు ఆ రెండు మన్వంతరాలు ఈ కల్పంలో మొదటిదైన స్వాయంభువ మన్వంతరం మరియు ఆరవదైన చాక్షుష మన్వంతరం!! మన ప్రస్తుత మన్వంతరం ఏడవది, వైవస్వత మన్వంతరమని పేరు!!

స్వామి రెండు సార్లు భూమిని రక్షించడానికే అవతారం ఎత్తారు!! బ్రహ్మ తన శరీరం నుంచి జన్మించిన స్వయంభువ మనువు మరియు శతరూపలను సృష్టి కార్యంలో పాల్గొని వివిధ జీవరాశులను ఉత్పత్తి చేయమని ఆదేశిస్తాడు కానీ భూమి ప్రళయ జలాలలో ఉంది. దీనినే గర్భోదక సముద్రం అని అంటారు. ఆ ప్రళయ జలాలలో  అట్టడుకు భూమి చేరింది కావున మా సంతానాన్ని అభివృధ్ధి చేసినా ఎక్కడ ఉండాలి అని ప్రశ్నిస్తారు!! అలా బ్రహ్మ ఆలోచిస్తుండగా స్వామి బొటన వ్రేలి పరిమాణంలో బ్రహ్మ నాసిక రంధ్రం నుంచి ఉద్భవించి చూస్తుండగానే భారీ వరాహ మూర్తిగా మారతాడు!!

ఇది విన్న తరువాత అందరికీ ఓ సందేహం వస్తుంది. భూమి పైనే సముద్రం ఉంది కదా మరి భూమి సముద్రంలో మునగడం ఏమిటి ?? అని.


దీని వలన మనకి తెలిసే మరియు మనం తెలుసుకోవలసిన ఇంకో విషయం ఏమిటంటే శ్రీమహావిష్ణువు సృష్టిలో అంటే విశ్వం(బ్రహ్మాండంలో) మన భూమి లేదా భూలోకం ఒకటి. అంటే ఇంకా ఇలాంటి లోకాలు 13 ఉన్నాయి. అవి సూక్ష్మ లోకాలుగా లేదా సాధారణ మానవుని చర్మ చక్షువులకి గోచరించని లోకాలుగా ఉన్నాయి.(ఇప్పటి పిల్లలకు చెప్పాలంటే alien plantes మరియు అక్కడ ఉండేవారిని aliens అని చెప్పాలేమో).

మొత్తం 14 లోకాలు వీటినే చతుర్దశ భువనాలు అంటాము. వీటిని మూడు భాగాలుగా విభజించారు.

 ఊర్థ్వ లోకం :  పై లోకాలు – 6 

భువర్లోక,

మువర్లోక, 

సువర్లోక, 

జనోలోక, 

తపోలోక మరియు సత్యలోకం [ఇది బ్రహ్మ గారి లోకం]

భూలోకం మరియు పాతాళ లోకాలు


కింది లోకాలు – 7 


అతల,

వితల, 

సుతల, 

తలాతల, 

మహాతల, 

రసాతల

పాతాళ లోకాలు.


ఇలాంటి విశ్వాలు శ్రీమహావిష్ణువు శరీరం రోమకూపాల నుంచి అనంతంగా వెలువడుతాయి. అందుకే అన్నమయ్య ఆ స్వామిని అనంతకోటి (అఖిలాండ కోటి) బ్రహ్మాండ నాయకా అని కీర్తించాడు


ఇప్పుడు మళ్ళీ కథనంలోనికి వస్తే భూమి అప్పుడు రసాతలంలో అడుగున చేరింది. ఆ రసాతలం కడు చీకటి లోకం మరియు బురద , అత్యంత చిత్తడితో కూడిన లోకం. వరాహానికి ఒక గొప్ప లక్షణం ఉంది దాని ఘ్రాణ శక్తి అద్భుతం. కావున ఇట్టి లోకంలో దాగిన భూమిని వెతకాలి కనుకనే స్వామి వరాహ అవతారం స్వీకరించారు!!


ఇదీ వరాహ అవతారం వెనుక ఉన్న సరైన విశ్లేషణ. ఎవరైనా ఈ అవతారాల గురించి తెలియకుండా హేళన చేసి  మాట్లాడితే తప్పకుండా వివరించి చెప్పండి.

◆ నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories