కాంచీపురాన్ని వెయ్యి దేవాలయాల నగరంగా పిలుస్తారు ఎందుకు.. పురాతన చరిత్ర ఏమిటంటే!

భారతదేశంలోని పవిత్ర నగరాల గురించి మాట్లాడుకుంటే, ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు కాశీ లేదా మధుర. కానీ భారతదేశంలోని వెయ్యి దేవాలయాల నగరం అని కాంచీపురాన్ని పిలుస్తారు. తమిళనాడులోని ఒక చిన్న పట్టణం కాంచీపురం.  దీన్ని వెయ్యి దేవాలయాల నగరం అని పిలుస్తారు. పాలార్ నది ఒడ్డున ఉన్న ఈ పురాతన నగరం పట్టు చీరలకు,  ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. కాంచీపురం వెయ్యి దేవాలయాల నగరం అని ఎందుకు పిలువబడుతుందో తెలుసుకుంటే..

 
వెయ్యి దేవాలయాల నగరం పేరు వెనుక..

పురాతన కాలంలో కాంచీపురంలో  పల్లవ, చోళ,  విజయనగర సామ్రాజ్యాల పాలనలో నిర్మించబడిన 1,000 కి పైగా దేవాలయాలు ఉన్నాయి. నేటికీ 120 కి పైగా పెద్ద,  అద్భుతమైన దేవాలయాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. వాటి నిర్మాణ నైపుణ్యలు  ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కాంచీపురం హిందూ మతంలోని ఏడు పవిత్ర నగరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కాంచీపురంలో గమనించదగ్గ  అత్యంత ముఖ్యమైన లక్షణం శైవ,  వైష్ణవ శాఖల సంగమం.

కాంచీపుర దేవాలయాల ప్రత్యేకతలు..

నిర్మాణ శైలి..

ఇక్కడి ఆలయాలను ప్రధానంగా పల్లవ, చోళ,  విజయనగర రాజులు నిర్మించారు. కాంచీపురంలోని పురాతన ఆలయమైన కైలాసనాథ ఆలయం, పల్లవ యుగం నాటి శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. దాని గోడలపై ఉన్న శిల్పాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. అవి రాతితో కాకుండా చెక్కతో చెక్కబడినట్లు కనిపిస్తాయి.


ఏకాంబరేశ్వర ఆలయం..

ఇది నగరంలోనే అతిపెద్ద ఆలయం.  ఇక్కడ శివుడిని పూజిస్తారు. పార్వతీ దేవి ఇక్కడ మట్టితో చేసిన శివలింగాన్ని పూజించిందని నమ్ముతారు. అందువల్ల ఇక్కడ శివుని మృణ్మయ  లింగాన్ని  పూజిస్తారు.

కామాక్షి ఆలయం..

కాంచీపురం అనగానే చాలామందికి కంచి కామాక్షి అమ్మవారు గుర్తుకు వస్తుంది. కంచి నగరం శక్తి కేంద్రంగా ఉంది. కామాక్షి  ఆలయం శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ కామాక్షి దేవి పద్మాసన భంగిమలో కూర్చుని, శాంతిని, శ్రేయస్సును ప్రసాదిస్తున్నట్టు గోచరిస్తుంది.


చీరలు, దేవాలయాల సంగమం..

కాంచీపురం స్వయంగా కాంజీవరం చీరలను చాలా ప్రసిద్ధి చెందింది.ఆసక్తికరంగా ఈ చీరల అంచులు,  డిజైన్లు తరచుగా ఇక్కడి దేవాలయాల శిల్పరీతి నుండి ,  గోపురాల నుండి ప్రేరణ పొందాయట.

                                         *రూపశ్రీ.


More Purana Patralu - Mythological Stories