తిరుమల వెంకన్న సన్నిధిలో విశ్వక్...
on Aug 13, 2020
యువ కథానాయకుడు విశ్వక్ సేన్ గురువారం తిరుమల సన్నిధికి వెళ్లారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విశ్వక్ వెంట ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు. స్వామి దర్శనం తర్వాత తిరుమల పుణ్యక్షేత్రంలో నలుగురు కలిసి ఫోటో దిగారు. సాధారణంగా విశ్వక్ కుటుంబానికి దైవభక్తి ఎక్కువ. హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు బాగా చేస్తారు. పండుగ సమయాలలో ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
'హిట్'తో ఈ ఏడాది ఇది విశ్వక్ సేన్ మంచి విజయం అందుకొన్నారు. ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతోంది. ప్రస్తుతం 'పాగల్' సినిమాలో విశ్వక్ నటిస్తున్నాడు. దాని తర్వాత హిట్ సీక్వెల్ చేయనున్నారు. కరోనా కారణంగా అన్ని సినిమాలతో పాటు అతడు చేస్తున్న సినిమా షూటింగులు ఆగాయి. కరోనా వైరస్ తగ్గడంతో పాటు త్వరలో మళ్లీ షూటింగులు ప్రారంభమై చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవం రావాలని, ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని సినిమా పరిశ్రమలోని వారంతా కోరుకుంటున్నారు.