ఆ ముగ్గురిలో డబుల్ డోస్ హీరోయిన్ ఎవరు?
on Nov 26, 2020
ఢీ (2007)తో అనూహ్య విజయం అందుకున్న మంచు విష్ణు - శ్రీను వైట్ల కాంబినేషన్ లో పదమూడేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత వస్తున్న చిత్రం డి అండ్ డి (డబుల్ డోస్). మంచు విష్ణు పుట్టినరోజు
సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.
కాగా, ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం ముగ్గురి పేర్లు వెలుగులోకి వచ్చాయి. అను ఇమ్మాన్యుయేల్, ప్రగ్యా జైశ్వాల్ తో పాటు బుల్లితెర వ్యాఖ్యాతలు కోమలి సిస్టర్స్ లో ఒకరైన హిరోషిని కోమలి పేరు కూడా
పరిశీలనలో ఉందట. మరి.. వీరిలో చివరాఖరికి ఎవరు నాయికగా కన్ఫామ్ అవుతారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేసే అవకాశముందంటున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
