ఎన్టీఆర్ కోసం పూజ హెగ్డే చాలా ఖర్చు చేస్తోందట
on Sep 8, 2018
ప్రస్తుతం పూజ హెగ్డే హీరోయిన్ గా తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ చాలా బిజి గా గడుపోతోంది. ఒక లైలా కోసం చిత్రంతో హీరోయిన్ గా పరిచయమై దువ్వాడ జగన్నాధం చిత్రం ద్వారా బ్రేక్ తెచ్చుకుంది. ఆమె ప్రెసెంట్ ఎన్టీఆర్ సరసన `అరవింద సమేత`, మహేష్ తో `మహర్షి` చిత్రాల్లో నటిస్తోంది. అలాగే ప్రభాస్ తో రాధా కృష్ణ చేయబోయే ప్రాజెక్ట్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ కి జంటగా `హౌస్ ఫుల్ -4` లోను నటిస్తుంది. ఇలా వరుస చిత్రాలతో పూజా కాల్ షీట్స్ ఫుల్లయ్యాయి.
హరి కృష్ణ సడన్ గా చనిపోవడం తో కొన్ని రోజులు ` అరవింద సమేత` చిత్రం షూటింగ్ వాయిదా పడింది. దీని వల్ల అప్పుడు తీయాల్సిన సీన్స్ ఇప్పుడు తీస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది. ఒక పక్క ఇక్కడ షూట్ లో పాల్గొంటూనే ...రాజస్థాన్ లోని జై సల్మేర్ లో జరుగుతున్న హౌస్ ఫుల్ -4 షూటింగ్ కి కూడా అటెండ్ అవుతున్నారట. దీని కోసం పూజా ప్రైవేట్ జెట్ లో ప్రయాణిస్తున్నారట. హైదరాబాద్ నుంచి జై సల్మేర్ కు కేవలం ఒకే ఫ్లయిట్ ఉందట. అందులో వెళ్లాలంటే టైం చాలా పడుతుందట. అందుకే ప్రైవేట్ జెట్ లో వెళ్తున్నట్టు సమాచారం. అందులో షూటింగ్ జరిగే ప్రాంతం మిలిటరీ ఏరియా కావడంతో స్పెషల్ పర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రైవేట్ జెట్ లో వెళ్ళడానికి లక్షల్లో ఖర్చు అవుతుందట. ఇది తెలిసిన వారంతా పూజా మనీ కన్నా టైం కి వేల్యూ ఇస్తుందంటూ తెగ పొగిడేస్తున్నారు .