గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్పై తాప్సీ రియాక్షన్
on Jul 10, 2020
ఉత్తరప్రదేశ్కి చెందిన గ్యాంగ్స్టర్, కరుడుగట్టిన నేరస్తుడు వికాస్ రూబేను ఈరోజు ఉదయం పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కొన్ని రోజుల క్రితం అరెస్టు చేయడానికి వెళ్లిన ఎనిమిది మంది పోలీసులు అతి కిరాతకంగా హత్యకు గురి కావడానికి కారణమైన వికాస్ దూబే అనుచరులు ఇద్దరిని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. కనిపిస్తే అతడిని కూడా కాల్చేస్తారని ప్రజలూ ఊహించారు. అందుకు తగ్గట్టే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో అరెస్ట్ చేసిన వికాస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ తీసుకువస్తుండగా ఎన్ కౌంటర్ జరిగింది. దీనిపై హీరోయిన్ తాప్సీ స్పందించారు.
"వావ్! మేం ఇది అస్సలు ఊహించలేదు. మళ్లీ వాళ్లు మా బాలీవుడ్ కథలను రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయని చెబుతారు" అని తాప్సీ ట్వీట్ చేశారు. వికాస్ దూబే ఎన్ కౌంటర్ వార్తను ట్వీట్ కి జోడించారు. బాలీవుడ్ పోలీస్ కథలు వాస్తవికతకు దూరంగా ఉంటాయని అన్న వాళ్ళ పై తాప్సీ సెటైర్ వేశారు అన్నమాట. వికాస్ దూబే ఎన్ కౌంటర్ సినీ ఫక్కీలో జరిగిందని పరోక్షంగా తన ట్వీట్ ద్వారా చెప్పారామె.
Also Read