ENGLISH | TELUGU  

వీళ్లకు బుద్ధి రాదా?

on Jul 26, 2017

 

సినిమా కథానాయికలపై రకరకాల కథనాలు సర్వసాధారణం. ఇది ఈ రోజుల్లోనే కాదు... సావిత్రి నాటి కాలంలో కూడా ఉన్నవేనని ఆనాటి వారు కూడా చెబుతుంటారు. అయితే... వ్యక్తిగతంగా మాత్రం నాటి కథానాయికలు  చాలా పద్ధతిగా మసలుకునేవారు. సావిత్రి జనరేషన్లోనే కాదు... పదిహేనేళ్ల క్రితం నాటి సౌందర్య, సిమ్రాన్ ల జనరేషన్లో కూడా... వారి వ్యక్తిగత ప్రవర్తన ఎప్పుడూ చర్చనీయాంశం కాలేదు. బయట ఏ వేడుకలు హాజరైనా... సంప్రదాయ బద్ధంగానే కనిపించేవారు.

కానీ.. జనరేషన్ మారుతున్న కొద్దీ కధానాయికల పోగడలలో మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చిట్టి పొట్టి గౌన్లతో వేడుకలు హాజరవ్వడం, వివాదాస్పదమైన దుస్తులు దరించి వార్తల్లోకెక్కడం. పెద్దవాళ్ల సమక్షంలో కూడా స్కిన్ షో చేయడం... ఇలాంటివన్నీ నేడు కొందరు నాయికలకు పరిపాటైపోయింది. ఇలాంటి ప్రవర్తన వల్ల పలు విమర్శలకు కూడా వారు గురి కావాల్సి వచ్చింది. కానీ... వారిలో మాత్రం మార్పు రాదు. ఇప్పుడు వారిలో ఇంకొంత ఇంప్రూవ్ మెంట్ కనిపిస్తోంది. మొన్నటి వరకూ వేదికలపై స్కిన్ షో చేస్తూ.. ఫొటోగ్రాఫర్ల కెమెరాలకు పనిపెట్టిన నేటి తారలు... ఇంకాస్త ముందుకెళ్లి.. పబ్ లో తమ విచిత్ర విన్యాసాలను కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారు.

‘మేం స్కిన్ షో మాత్రమే చేయం... విచ్చలవిడిగా తాగుతాం. తిరుగుతాం’ అని చెప్పకనే చెబుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే... రీసెంట్ గా ఇద్దరు కథానాయికలు పబ్బుల్లో తాగుతూ.. చిందులు తొక్కుతూ... ఆ వెర్రి వేషాలను ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వారి గురించి చెప్పేముందు ఇదంతా చెప్పాల్సొచ్చింది. తెలుగు ‘హలోబ్రదర్’చిత్రం... ‘జుడ్వా’ పేరుతో హిందీలో రీమేక్ పెద్ద హట్ అయిన విషయం తెలిసిందే. ఇది ఇరవై ఏళ్ల పై మాట. ప్రస్తుతం ఆ చిత్రాన్ని మళ్లీ ‘జుడ్వా 2’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. వరుణ్ ధావన్ ఇందులో హీరో. జాక్వెల్ ఫెర్నాండెజ్, తాప్సీ హీరోయిన్లు.

ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. ఇటీవల షూటింగ్ గ్యాప్ రాగానే... తాప్సీ, జాక్వెల్ ఫెర్నాండేజ్ ఇద్దరూ కలిసి పబ్ కి వెళ్లారు. అక్కడ వైన్, ఓడ్కా లాంటివి తాగి చిందులు తొక్కారు. నిజానికి ఈ విషయం ప్రపంచానికి అనవసరం. ఇది పూర్తిగా వారి వ్యక్తిగతం.  అయినా ఎందుకు చెప్పుకోవల్సివచ్చిందంటే... వారి వెర్రి వేషాలను సెల్ఫీలుగా తీసి ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఒళ్లంతా కనిపించేలా పొట్టి పొట్టి దుస్తులు ధరించి, చేతిలో ఓడ్కా గ్లాస్ పట్టుకొని చిందులేస్తూ ఉన్న ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇలాంటి పనులుతో సమాజానికి వీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అనేది ఇక్కడ ప్రశ్న. సినిమా అత్యధికంగా ప్రభావితం చేసే మాధ్యమం. అలాంటి మాధ్యమంలో ఉన్న కొందరు తారలు, తాము వ్యక్తిగతంగా ఎంత విచ్చలవిడిగా ఉంటామో ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా జనాలకు  చెప్పి.. సినిమా రంగం పరువు తీయడం ఎంతవరకు సమంజసం? అనేది కొందరి వాదన.

వీళ్లకు బుద్ధి ఎప్పుడొస్తుందో ఏమో!

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.