సందీప్ కిషన్ తో నందినీ రెడ్డి చిత్రం?
on Dec 4, 2020
అలా మొదలైంది, జబర్ దస్త్, కళ్యాణ వైభోగమే.. ఇలా రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు దర్శకురాలు నందినీ రెడ్డి. ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ఓ బేబి తరువాత మళ్ళీ మెగాఫోన్ పట్టని నందిని.. త్వరలో తన శైలిలోనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేయబోతున్నారట. ఇందులో కథానాయకుడిగా సందీప్ కిషన్ నటించే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుందని టాక్. ఇందులో ఓ ప్రముఖ కథానాయిక.. సందీప్ కి జోడీగా కనిపిస్తారని బజ్. ఆ హీరోయిన్ ఎవరో అతి త్వరలోనే క్లారిటీ వస్తుంది. మరి కొద్దిరోజుల్లో సందీప్ కిషన్ - నందినీ రెడ్డి కాంబినేషన్ మూవీకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశముంది.
కాగా, సందీప్ కిషన్ ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఏవన్ ఎక్స్ ప్రెస్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అతనికి జోడీగా అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి నటిస్తోంది.