ఈ ఫోటోలో మిస్సయిన వారేవరు..?
on Nov 22, 2017
చిన్నప్పుడో.. కాలేజ్ రోజుల్లోనో మనతో చదువుకున్న వారిని జీవితంలో ఎదిగే క్రమంలో మరచిపోతూ ఉంటాము. కానీ వారిని మళ్లీ కలిస్తే ఎంత బావుండు అని మనసులో ఒక ఆలోచన రాకమానదు. అందుకే గెట్ టూ గెదర్లు, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు అంటూ కలుసుకుంటూ నాటి జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటారు. అచ్చం అలాగే 80లలో దక్షిణాదిలోని నాలుగు సినీపరిశ్రమలకు చెందిన తారలంతా ఒకేచోట చేరి నాటి మధుర జ్ఞాపకాల్లోకి వెళుతూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దీనికి సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్ అనే పేరు కూడా పెట్టారు.
వీరంతా ఇప్పటికీ ఏడుసార్లు కలిశారు. తాజాగా ఎనిమిదో సారి ఒకచోట చేరారు. మొత్తం 28 మంది నటీనటులు ఈ నెల 17న చెన్నయ్లోని ఓ ప్రయివేట్ రిసార్ట్లో గెట్ టూ గెదర్ అయ్యారు. ఈ పార్టీకి స్టార్లంతా ఉదారంగు దుస్తులు, పూలచొక్కాలు ధరించి ఫోటోలకి ఫోజులిచ్చారు. అయితే ఈ ఫ్రేమ్ని జాగ్రత్తగా గమనిస్తే కొందరు స్టార్లు మిస్సయ్యారు.. వారిలో బాలకృష్ణ, రజనీకాంత్, కమల్హాసన్, మోహన్లాల్ ఉన్నారు. ప్రస్తుతం వీరు ఎందుకు రాలేదు అన్న దానిపై సౌత్ ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ నడుస్తోంది. కమల్ - రజనీల మధ్య రాజకీయపరమైన మనస్పర్థలు తలెత్తడంతో వారు రాలేదని ఫిల్మ్ క్రిటిక్స్ భావిస్తుండగా.. బాలయ్య, మోహన్లాల్ ఎందుకు హాజరుకాలేదో కారణం తెలియరాలేదు.