సిద్ధార్థ్, సోహా అలీఖాన్ ఎందుకు విడిపోయారు?
on Oct 16, 2020
కొన్నేళ్ల క్రితం బాలీవుడ్లో సిద్ధార్థ్, సోహా అలీఖాన్ (సైఫ్ అలీఖాన్ చెల్లెలు) లవ్ స్టోరీ హాట్ టాపిక్. అయితే తమ రిలేషన్షిప్ను వాళ్లెప్పుడూ బయటపెట్టుకోలేదు. సిద్ధార్థ్ డివోర్సీ కావడం, సోహా వంశం కారణంగా వాళ్లు తమ బంధాన్ని రహస్యంగానే ఉంచారు. ఆ ఇద్దరి నుంచి ఏదో ఒకరోజు అఫిషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని అందరూ భావిస్తున్న కాలంలో వాళ్లు విడిపోయారు. 'రంగ్ దే బసంతి' షూటింగ్ టైమ్లో ఆ ఇద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. క్రమేణా వాళ్ల స్నేహం బలపడి, ప్రేమగా మారింది. ఆ టైమ్లో ఆమె కోసమే సిద్ధార్థ్ చెన్నై నుంచి తన మకాంను ముంబైకి మార్చాడని చెప్పుకుంటారు.
తనకు ప్రశ్న ఎదురైనప్పుడల్లా సిద్ధార్థ్తో తను డేటింగ్ చేయట్లేదని ఖండిస్తూ వచ్చేది సోహా. కానీ వాళ్లిద్దరి మధ్య బంధం, వాళ్ల కెమిస్ట్రీపై మీడియాలో ప్రచారం సాగుతూ వచ్చింది. హిందుస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో "సిద్ధార్థ్, నేను 'రంగ్ దే బసంతి' రోజుల నుంచీ మంచి ఫ్రెండ్స్మి. అలైస్ పాటెన్, కునాల్ కపూర్ కూడా నాకు స్నేహితులే. శర్మాన్ జోషితోనూ నేను పనిచేశాను. అలాగే సిద్ధార్థ్తో టచ్లో ఉండేదాన్ని. భిన్న నగరాల్లో మేం మా సినిమాలు చేసుకుంటూ ఉండేవాళ్లం. ఎప్పుడైనా ముంబైలో మేం కలుసుకున్నామంటే, దానర్థం మేం డేటింగ్లో ఉన్నట్లు కాదు." అని తెలిపింది సోహా.
ఒకసారి పటౌడీ జీవించి ఉన్నప్పుడు సిద్ధార్థ్ను తన ఇంటికి డిన్నర్కు ఆహ్వానించింది సోహా. అతని కూల్ యాటిట్యూడ్, అతని కలుపుగోలుతనం మన్సూర్ అలీఖాన్, షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీఖాన్లను బాగా ఆకట్టుకుందంటారు. ఇండియా టుడే రాసిన దాని ప్రకారం సోహాతో జీవితాంతం బంధం ఏర్పరచుకోవాలని సిద్ధార్థ్ అనుకోలేదు. మరోవైపు సిద్ధార్థ్ తనకే ప్రాముఖ్యం ఇవ్వాలని సోహా కోరుకుంది. అది ఇద్దరి మధ్యా గొడవలకు దారి తీసింది. గొడవ జరిగిన ప్రతిసారీ సోహానే రాజీపడుతూ వచ్చిందని బాలీవుడ్లో చెప్పుకుంటూ ఉంటారు.
Also Read