ఓటీటీలో 'రొమాంటిక్'
on Nov 30, 2020
ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'రొమాంటిక్'. ఆయన తనయుడు పూరీ ఆకాష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాతో కేతికా శర్మ తెలుగు తెరకు నాయికగా పరిచయమవుతోంది. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని యువ దర్శకుడు అనిల్ పాదూరి తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని.. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా తుది దశకు చేరుకున్నాయని సమాచారం. అలాగే ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో రొమాంటిక్ స్ట్రీమ్ అయ్యే దిశగా ప్లానింగ్ జరుగుతోందని, ఈ మేరకు చర్చలు కూడా పూర్తయ్యాయని బజ్. మరి.. ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
మాఫియా నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమైన 'రొమాంటిక్'లో బాలీవుడ్ నటుడు మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రలో నటిస్తున్నాడు.