వార్తల్లోని వ్యక్తులు రిచా, అలీ పెళ్లెప్పుడు?
on Oct 18, 2020
కొవిడ్-19 దెబ్బకు చాలామంది వేసుకున్న ప్లాన్స్ తలకిందులయ్యాయి. పెళ్లాడదామనుకున్న వాళ్లు కూడా ఆ వేడుకను వాయిదా వేసుకున్నారు. అలాంటి వారిలో ఇటీవలి కాలంలో వార్తల్లో వ్యక్తులుగా మారిన రిచా చాధా, అలీ ఫజల్ జంట కూడా ఉంది. అనురాగ్ కశ్యప్ వ్యవహారంలో తన పేరును లాగిన పాయల్ ఘోష్పై పరువు నష్టం దావా వేయడం ద్వారా రిచా హెడ్లైన్స్లో నిలవగా, 'మిర్జాపూర్ 2' వెబ్ సిరీస్లో లీడ్ రోల్ చేసిన అలీ ఫజల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్లో తరచూ కనిపిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్లో పెళ్లి చేసుకోవాలని ఆ ప్రేమజంట వేసుకున్న ప్లాన్స్ను కరోనా దెబ్బ తీసింది.
'ఫక్రే' సినిమా సెట్స్పై ఫస్ట్ టైమ్ మీట్ అయిన ఆ జంట ఆ సినిమాలో చేసిన పాత్రల తరహాలోనే రియల్ లైఫ్లోనూ ప్రేమలో పడ్డారు. రోజు రోజుకూ వాళ్ల మధ్య బంధం బలపడుతూ వస్తోంది. 2020లో మార్చిలో వారి పెళ్లి వార్త వెలువడింది. ఏప్రిల్లో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నట్లు వాళ్లు తెలిపారు. కానీ మహమ్మారి కారణంగా పెళ్లిని వారు వాయిదా వేసుకున్నారు.
నార్మల్ కండిషన్స్ రాగానే వెడ్డింగ్ డేట్ డిసైడ్ చేస్తామనీ, బహుశా అది 2021 మొదట్లో కావచ్చనీ అలీ ఫజల్ చెప్పాడు. తమ పెళ్లికి హాజరవ్వాలని కోరుకుంటున్న శ్రేయోభిలాషుల కోసం వచ్చే ఏడాదికి తమ పెళ్లి వాయిదా వేసుకున్నామని రిచా కూడా తెలిపింది.
Also Read