`సాహో` కి ఎటువంటి రీ షూట్స్ చేయట్లేదు!!
on May 6, 2019
రెబల్ స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం `సాహో`. యంగ్ డైరక్టర్ సుజిత్ ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాడు. యువి క్రియేషన్స్ సంస్థ ఎంతో గ్రాండ్ గా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీ ఇటీవల ముంబై లో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీంతో ఒకపాట మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కాగా...విదేశాల్లో ఆ పాటను పిక్చరైజ్ చేయబోతున్నారనీ వార్తలు వస్తున్నాయి. మరోవైపు నిర్మాణానంతర పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. హై టెక్నికల్ వాల్యూస్ తో , హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీన్స్ తో ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని నిర్మించినట్లు చిత్ర యూనిట్ తెలుస్తుంది. అయితే ఇటీవల మళ్లీ రీ షూట్ చేయాలనీ, కొన్ని సీన్స్ పట్ల ప్రభాస్ సంతృప్తిగా లేరని వచ్చిన వార్తల్లో నిజం లేదనీ, ఎటువంటి రీ షూట్స్ చేయట్లేదని యువి వారు చెప్పుకొస్తున్నారు. హై ఎక్స్ పెక్టేషన్ తో వస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 15న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.