ఆ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టిన మైత్రి సంస్థ!!
on Nov 9, 2018
ఇంత వరకు అపజయమెరుగక విజయ బావుటా ఎగరేసిన సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. కానీ, ఇటీవల విడుదలైన `సవ్యసాచి` చిత్రం మైత్రీ వారికి అపజయాన్ని చవి చూపింది. దీంతో ఇక మీదట చేసే సినిమాలపై చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాలని భావిస్తోందట మైత్రీ సంస్థ. ఇందులో భాగంగానే రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించుదామనుకున్నా కానీ నిర్మాతలు ప్రస్తుతానికి ఆ సినిమాను హోల్డ్ లో పెట్టారన్న న్యూచ్ సోషల్ నెట్ వర్క్స్ లో హల్ చల్ చేస్తున్నాయి.
తమిళంలో విజయ్ నటించిన `తెరి` చిత్రం తెలుగు రైట్స్ తీసుకుని ఈ చిత్రాన్ని మొదట పవన్ కళ్యాన్ తో రీమేక్ చేద్దామనకున్నారు. అయితే పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటం వల్ల `తెరి` రీమేక్ ను సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజతో తెరకెక్కించుదామని చాలా కాలం వర్క్ చేసారు కూడా. సవ్యసాచి రిజల్ట్ తో రిస్క్ ఎందుకని కొంత కాలం హోల్డ్ పెట్టారని తెలుస్తోంది.
చాలా కాలంగా ఈ స్క్రిప్టు పై వర్క్ చేస్తూ వచ్చిన సంతో ష్ శ్రీనివాస్ కు మళ్లీ నిరాశే ఎదురైంది. హోల్డ్ లో పెట్టిన ఈ సినిమా అసలు పట్టాలు ఎక్కుతుందా? లేదా ? అన్నది రవితేజ్ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోని సక్సెస్ మీద ఆధార పడి ఉంటుందన్న సినీ పండితులు చెబుతోన్న మాట.