'పుష్ప'లో కొత్త 'రష్మిక'ను చూస్తారు
on Jun 17, 2021
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ 'పుష్ప' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ పుష్పలో తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది రష్మిక.
"పుష్పలో నా పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంతవరకూ నేను చేయని పాత్ర ఇది. పల్లెటూరి అమ్మాయిగా ఇందులో నేను కనిపిస్తాను. దానివల్ల ప్రేక్షకులు నా పాత్రకు వెంటనే కనెక్ట్ అవుతారు. నాకు ఇష్టమైన పాత్రలో.. రెండు భాగాలలోను నేను కనిపించనుండటం నాకు మరింత సంతోషాన్నిచ్చే విషయం. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది." అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.
కాగా పుష్పను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగానికి సంబంధించి షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కాస్త విరామం తరువాత రెండో భాగం చేయనున్నారు. పుష్పలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు.