చిరు సెటైర్.. పూరి వైఫ్ ఫుల్ ఫైర్!
on Apr 1, 2020
మెగాస్టార్ చిరంజీవి చేసిన ఒక్క ట్వీట్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొంప ముంచింది. పెళ్లాం చేతిలో చెంపదెబ్బ తినేలా చేసింది. తర్వాత పెద్దాయన్ని ఏమీ అనలేక సైలెంట్గా ఉండిపోయారు. అసలు వివరాల్లోకి వెళ్లాలంటే... చిరంజీవి ట్విట్టర్లో ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచి చెప్పాలి.
మెగాస్టార్ ట్విట్టర్ ప్రపంచంలోకి వచ్చిన సందర్భంగా పూరి జగన్నాథ్ వెల్కమ్ చెబుతూ ఒక ట్వీట్ వేశారు. ‘‘సార్... ట్విట్టర్ సామాజిక మాధ్యమానికి మీకు స్వాగతం. సామాజిక దూరం పాటిస్తున్న ఈ సమయంలో, ఇప్పుడీ సామాజిక మాధ్యమం మమ్మల్ని మీకు దగ్గర చేస్తోంది’’ అని పూరి అన్నారు. అందుకు బదులుగా చిరంజీవి ‘‘థ్యాంక్యూ పూరి. మనం ఫ్యామిలీ దగ్గరగా ఉండేలా చేస్తోందీ టైమ్. బహుశా... నువ్వు బ్యాంకాక్, ముంబై బీచ్లు మిస్ అవుతున్నావేమో. కానీ, నీతో ఇంట్లో టైమ్ స్పెండ్ చేస్తున్నందుకు పవిత్ర, ఆకాశ్ హ్యాపీగా ఉంటారు’’ అన్నారు. ఈ ట్వీట్ చూసి పూరి జగన్నాథ్ వైఫ్ లావణ్య ఆయన్ను చెంప మీద కొట్టారట. ఎందుకు అనేది పూరి మాటల్లో చూడండి.
‘‘లాక్డౌన్ టైమ్లో చిరంజీవిగారు బ్యాంకాక్ టాపిక్ ఎందుకు ఎత్తారో తెలియదు. ఆ ట్వీట్ చూసిన మా ఆవిడకి అన్నీ ఒకేసారి గుర్తుకు వచ్చాయి. నా చెంప పగిలిపోయింది. ఆయన ట్వీట్ నా కొంప ముంచింది’’ అని కరోనా గురించి ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. కరోనాపై తనకు సినిమా తీసే ఉద్దేశం లేదని చెప్పిన పూరి, పదేళ్ల కిందటే కరోనా లాంటి వైరస్ వస్తే ప్రపంచం ఎలా ఉంటుందో రామ్గోపాల్ వర్మ చెప్పారని అన్నారు.