బాబూ అది వెబ్ సిరీస్ కాదు.. సినిమా!
on Sep 15, 2020
ప్రస్తుతం సినిమా షూటింగులు స్టార్ట్ చేసిన టాలీవుడ్ సెలబ్రిటీల జాబితాలో ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి కూడా చేరారు. ఆదివారం ఆయన 'కంబాలపల్లి కథలు' షూటింగ్ ప్రారంభించారు. ఉదయ్ గుర్రాల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను స్వప్న సినిమా సంస్థ నిర్మిస్తోంది. అయితే చాలా మంది ఇది వెబ్ సిరీస్ అని అనుకుంటున్నారు. కొంతమంది వెబ్ సిరీస్ అని వార్తలు రాశారు. అయితే... తమది సినిమా అని ప్రియదర్శి చెప్పారు.
"ఇది వెబ్ సిరీస్ కాదు. సినిమా. దీనికి సీక్వెల్ కూడా తీయాలని అనుకుంటున్నట్లు దర్శకుడు నాతో చెప్పారు. ప్రస్తుతానికి కంబాలపల్లి కథలు చాప్టర్ వన్ షూటింగ్ చేస్తున్నాం" అని ప్రియదర్శి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో హైబత్ పాత్రలో అతడు నటిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన 'కుంబళంగి నైట్స్'కి ఈ సినిమా రీమేక్ అని ఫిలింనగర్ గుసగుస. దర్శక నిర్మాతలు అఫీషియల్ గా ఏ విషయం చెప్పలేదు.
Also Read