టాలీవుడ్లో కరోనాతో నిర్మాత మృతి
on Jul 4, 2020
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి కరోనా మరణం నమోదు అయింది. కొవిడ్-19 మహమ్మారి ఓ తెలుగు నిర్మాతను బలి తీసుకుంది. ఇప్పటివరకూ కరోనా కేసులు గురించి మాత్రమే విన్న టాలీవుడ్, ఈ ఘటనతో ఒక్కసారి ఉలిక్కి పడింది. అసలు వివరాల్లోకి వెళితే...
సీనియర్ నిర్మాత పోకూరి బాబురావు సోదరుడు పోకూరి రామారావు కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. కొవిడ్-19 పాజిటివ్ అని టెస్టుల్లో వెల్లడి కావడంతో కొన్ని రోజులుగా ఆయన హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈతరం ఫిలిమ్స్ పతాకంపై పోకూరి సోదరులు పలు చిత్రాలు నిర్మించారు. ఆయా చిత్రాలకు రామారావు సమర్పకులుగా వ్యవహరించారు.
విప్లవ చిత్రాల దర్శకుడు టి. కృష్ణతో పోకూరి సోదరులకు మంచి అనుబంధం ఉంది. ఆయనతో 'నేటి భారతం', 'దేశంలో దొంగలు పడ్డారు', 'రేపటి పౌరులు' అభ్యుదయ వంటి చిత్రాలు నిర్మించారు. టి. కృష్ణ కుమారుడు గోపీచంద్ హీరోగా 'యజ్ఞం', 'రణం' తీశారు. పోకూరి రామారావు మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read