భార్యాభర్తలుగా నటించనున్న చైతూ, సమంత
on Jul 13, 2018
ఏం మాయ చేశావేలో ప్రేమికులుగా నటించిన నాగచైతన్య, సమంత ఎట్టకేళకు దంపతులుగా మారిపోయారు. ఇప్పుడు ఎవరి కెరీర్లో వాళ్లు మంచి బిజీగా ఉన్నారు. సమంత సంగతైతే అసలు చెప్పనే అక్కర్లేదు. పెళ్లి తర్వాత మరింత దూకుడుని పెంచిన శామ్ రంగస్థలం, మహానటి, అభిమన్యుడులాంటి సినిమాలలో అదరగొట్టేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే... నాగచైతన్య, సమంత ఇప్పుడు మరోసారి స్క్రీన్ మీద కనిపించనున్నారట. అయితే ప్రేక్షకులు వాళ్లని మళ్లీ ప్రేమికులుగా ఆదరించరో అనో ఏమో కానీ... ఈసారి వీళ్లిద్దరూ పెళ్లయిన జంటగా కనిపిస్తారట. నిన్ను కోరి సినిమాతో తనేమిటో నిరూపించుకున్న దర్శకుడు శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. చైతూ, సమంత జంట పెళ్లయిన తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.