కళాతపస్వికి దాదాసాహెబ్ ఫాల్కే
on Apr 24, 2017
దశాబ్దాలుగా తెలుగు సినిమాకు సేవలు అందిస్తూ..ఎన్నో మరపురాని సినిమాలు తీసిన కళాతపస్వీ కె విశ్వనాథ్ గారి కిర్తీ కిరిటంలో మరో కలికితురాయి చేరింది. 2016వ సంవత్సరానికి గానూ కె. విశ్వనాథ్కు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. ఢిల్లీలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఈ విషయాన్ని తెలిపారు. మే 3న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయనకు అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న చిత్ర ప్రముఖులు విశ్వనాథ్కు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read