హీరోయిన్ల ఫోన్లు తీసుకున్నారు.. సంతకాలు తీసుకోవడం మరిచారు!
on Sep 29, 2020
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్లు దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వాళ్ల సంతకాలు తీసుకోవడం మరిచారని నేషనల్ న్యూస్ ఛానల్ టైమ్స్ నౌ పేర్కొంటోంది. ఫోన్లు సీజ్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ మీద ఆ హీరోయిన్ల సంతకాలు తీసుకోవడం కంపల్సరీ. జరిగిన పొరపాటును గ్రహించిన అధికారులు వెంటనే దిద్దుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.
దీపిక, రకుల్, సారా, శ్రద్ధా... నలుగురిని ఎన్సీబీ అధికారులు ఇంటరాగేషన్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు సంతకాలను సోమవారం తీసుకున్నారట. సారా అలీ ఖాన్ ఇంటికి వెళ్లగా... ఆమె ఇంట్లో లేదట. దాంతో సారా అలీ ఖాన్ వ్యక్తిగత సిబ్బంది సంతకాలు తీసుకుని వచ్చారట.
సుశాంత్ తో సన్నిహితంగా ఉన్న విషయాన్ని ఎన్సీబీ అధికారుల విచారణలో సారా అలీ ఖాన్ అంగీకరించినట్లు సమాచారం. అయితే తానెప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని ఆమె చెప్పారట. అలాగే శ్రద్ధా కపూర్ సైతం సుశాంత్ ఫాంహౌస్ పార్టీకి వెళ్లాననీ, కానీ డ్రగ్స్ ఎప్పుడూ తీసుకోలేదనీ, పార్టీకి అందరూ వచ్చేలోపే తాను అక్కడి నుండి వచ్చేసాననీ చెప్పారట.
Also Read