చిరంజీవి టీమ్కు థాంక్స్ చెప్పిన ప్రధాని మోదీ
on Apr 3, 2020
కరోనా వైరస్ విషయంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి కరోనా క్రైసిస్ చారిటీ తరపున ఇటీవల తెలుగు సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ఓ పాటను విడుదల చేశారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి స్వరపరచి, గానం చేసిన ఈ పాటకు ఆ నలుగురూ అభినయించారు. ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. ఈ పాట విషయం ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి వెళ్లింది. ఆ పాటను వీక్షించిన ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.. అదీ తెలుగులోనే కావడం విశేషం.
"చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.
అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.
అందరం సామాజిక దూరం పాటిద్దాం.
కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం."
అని ఆయన తెలుగులో పోస్ట్ చేశారు. కాకపోతే ఆ వీడియో రూపకర్త కోటి పేరును ఆయన ప్రస్తావించలేదు.
ప్రధాని అంతటి వ్యక్తి తమ కృషిని అభినందించడంతో మన హీరోలు కూడా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కోటి పేరును ప్రధాని ప్రస్తావించకపోవడాన్ని గ్రహించిన చిరంజీవి.. మోదీకి ధన్యవాదాలు తెలిపిన పోస్ట్లో కోటి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించి తమ అందరి తరపున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.