పైసా వసూల్కి బాలకృష్ణ.. అరవిందకు ఎన్టీఆర్!
on Sep 28, 2018
నందమూరి హీరోల సింప్లిసిటీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నందమూరి అభిమానులు తమ హీరోల సింప్లిసిటీ గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు. అసలు వివరాల్లోకి వెళితే... ఇటీవల 'అరవింద సామెత వీరరాఘవ' సినిమాలో ఒక పాట చిత్రీకరణకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటలీ వెళ్లొచ్చారు. స్టార్ హీరోలు ఏ దేశంలో షూటింగ్ చేసినా వాళ్లకు సకల సౌకర్యాలు అందుబాటులో వుండటం సహజమే. ఇటలీలో అటువంటి సౌకర్యాలకు దూరంగా నేల మీద ఎన్టీఆర్ కూర్చున్నారు. ఎవరో అప్పుడు ఫొటో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. తద్వారా ఎన్టీఆర్ సింప్లిసిటీ గురించి అందరికీ తెలిసింది.
నందమూరి బాలకృష్ణ కూడా 'పైసా వసూల్' సినిమా షూటింగ్ కోసం పోర్చుగల్ వెళ్లారు. అప్పుడు కటిక నేల మీద కునుకు తీశారు. నందమూరి తారకరామారావు తనయుడు, అగ్ర కథానాయకుడు అయిన బాలయ్య అలా నేల మీద నిద్రించడం చర్చనీయాంశం అయ్యింది. అప్పట్లో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. అప్పుడు బాలకృష్ణ... ఇప్పుడు ఎన్టీఆర్... సింప్లిసిటీకి చిరునామాలా నిలిచారు. వీళ్లిద్దరి సింప్లిసిటీ చూసి అభిమానులు గర్వపడుతున్నారు.