5 డేస్.. 'నాంది'కి వచ్చిన కలెక్షన్ ఇదే!
on Feb 24, 2021
అల్లరి నరేశ్ హీరోగా నూతన దర్శకుడు విజయ్ కనకమేడల రూపొందించిన క్రైమ్ డ్రామా 'నాంది' మూవీ విడుదలైన ఐదు రోజులకు బ్రేకీవెన్ సాధించింది. ఈ నెల 19న ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. లాయర్గా వరలక్ష్మీ శరత్కుమార్ నటించిన ఈ మూవీ ఐదో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 31 లక్షల షేర్ సాధించింది. వరల్డ్ వైడ్గా చూసుకుంటే రూ. 3 కోట్ల షేర్ మార్క్ను అధిగమించింది. దీంతో 'నాంది' బ్రేకీవెన్ సాధించినట్లయింది.
ఓవర్సీస్తో కలిపి ఈ సినిమాకు 2.7 కోట్ల ప్రి బిజినెస్ జరిగింది. రూ. 3 కోట్లు వస్తే బ్రేకీవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మంగళవారంతో ఆ మార్క్ను చేరుకొని డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు అందించేందుకు రెడీ అయ్యింది. నైజాం ఏరియాలో అయితే సోమవారంకే బ్రేకీవెన్ సాధించింది. ఈ ఏరియాలో 'నాంది'ని వరంగల్ శ్రీనివాస్ డిస్ట్రిబ్యూట్ చేశారు.
'సుడిగాడు' (2012) మూవీ తర్వాత చెప్పుకోడానికి సరైన విజయం లేని అల్లరి నరేశ్కు 'నాంది' సినిమా కొత్త ఊపిరినిచ్చింది. ఇప్పటిదాకా కామెడీ సినిమాలతోటే విజయాలు సాధిస్తూ వచ్చిన నరేశ్ ('గమ్యం' మూవీ శర్వానంద్ ఖాతాలోకి వెళ్తుంది), ఇప్పుడు 'నాంది' లాంటి సీరియస్ సబ్జెక్ట్, సీరియస్ రోల్తో హిట్ని సాధించడం చెప్పుకోదగ్గ విషయం.
Also Read