రాజమౌళిపై మీడియాకి కోపమొచ్చింది
on Jul 7, 2015
'బాహుబలి' దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డపై మీడియా మిత్రులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీనికి కారణం వారు చూపిస్తున్న వివక్షేనట. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి చిత్రం 'జూలై 10' న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమా ప్రచారం కోసం వారు ప్రత్యేకంగా కొన్ని మీడియా, పత్రికలకే ఇంటర్వ్యూ లు చేసే అవకాశం కల్పించడం, మిగిలిన వారిని పట్టించుకోకపోవడంతో వారు మండిపడుతున్నారు. తమని చిన్న చూపు చూడటమెంటని మీడియా మిత్రులు రాజమౌళిని ప్రశ్నించగా షెడ్యూల్స్ ప్రకారం ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నామని చెప్పారట. మరి మాకు ఎప్పుడిస్తారని వారు డైరెక్ట్ గా ప్రశ్నించగా రాజమౌళి మాట దాటేశారట. దీంతో బాహుబలి టీమ్ చూపిస్తున్న వివక్షతకు సదరు మీడియా సోదరులు ఆగ్రహంతో ఊగిపోతున్నారట. ఈ కారణం వల్ల వారు ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ కూడా త్వరగా ముగించారట. 'బాహుబలి' రిలీజ్ దగ్గర సమయంలో ఇలా మీడియా సోదరుల ఆగ్రహానికి గురి కావడం అంత మంచిది కాదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయట.