ENGLISH | TELUGU  

మెగా యంగ్ స్టర్స్ ముగ్గురితో...?

on Jul 26, 2017

 

లావణ్య త్రిపాఠి అద్భుతమైన ఆఫర్ కొట్టేసిందని ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే మెగా కాంపౌండ్ హీరోలతో.. శ్రీరస్తు శుభమస్తు, మిస్టర్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో మరో మెగా యంగ్ హీరోతో జతకట్టనుందట. వివరాల్లోకెళ్లే.... సాయిధరమ్ తేజ్, వి.వి.వినాయక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘దుర్గ’ అనే వర్కింగ్ టైటిల్ ని కూడా నిర్ణయించారు వినాయక్. ఇందులో కథానాయికగా లావణ్య త్రిపాఠి ఎంపిక చేసినట్టు విశ్వసనీయ సమాచారం.  ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత వినాయక్ చేయనున్న సినిమా అంటే.. దాని అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాలా? మరి అలాంటి సినిమాలో ఆఫర్ అంటే...  లావణ్య నిజంగా లక్కీనే అంటున్నారంతా. 

‘శ్రీరస్తు శుభమస్తు’చిత్రం ద్వారా  అల్లు శిరీష్ కి తొలి సక్సెస్ ని ఇచ్చిన  ఈ బెంగాలీభామ... ఆ తర్వాత మరో మెగా హీరో వరుణ్ తేజ్ తో ‘మిస్టర్’చేసి పప్పులో కాలేసింది. ఇప్పుడు మెగా కాంపౌండ్ లోని మరో యువ హీరో సాయిథరమ్ తేజ్ తో జతకట్టనుంది. ఇదే నిజమైతే... ఈ సినిమాతో మెగా యంగ్ స్టర్స్ ముగ్గురితో నటించిన క్రెడిట్ లావణ్యకు దక్కినట్టే.  ఆకుల శివ రచన చేస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆగస్ట్ 9న జరగనున్నట్లు సమాచారం. వి.వి.నాయక్, ఆకుల శివ కాంబినేషన్లో వచ్చిన ‘కృష్ణ’ఎంత హిట్టో తెలిసిందే. ఈ సినిమా కూడా ‘కృష్ణ’తరహాలో కామెడీ మాస్ ఎంటర్టైనర్ గా సాగుతుందని వినికిడి.


 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.