ENGLISH | TELUGU  

పాటల రారాజు... కొసరాజు

on Sep 21, 2018

పాటలు వ్యంగంగా సాగుతాయి , చివరకి వచ్చేసరికి ప్రేక్షకులతో గొల్లున నవ్విస్తాయి. అలాగే ఆయన పాటలు ఆవేశాన్ని, ఆలోచనని కూడా రగిలిస్తాయి . మట్టి వాసనని మనసుకి చేరుస్తాయి.అందుకే తెలుగు పాటల సాహిత్యం లో ఆయనది ఒక ప్రత్యేక ముద్రగా చెబుతారు సినీ పండితులు. ఆయన పాటలు రాసిన మొదటి సినిమా రైతు బిడ్డ . ఈ సినిమా లో నిద్ర మేల్కొనర తమ్ముడా అన్న పాట ఆయన మొదటి సినిమా పాట. కొసరాజు గారు కి సినిమా ప్రపంచం తో అస్సలు పరిచయం లేదు . ఆయన ఒక రైతు. హలం పట్టి పొలం దున్నటం ఎంత ఇష్టమో , కలం పట్టి కవిత్వం రాయటం కూడా అంతే ఇష్టం ఆయనకి. చదివింది నాలుగో తరగతి మాత్రమే . అయితే సకల పురాణాలూ , వేదాలు చదివేసారు. సంస్కృతఆంద్రాలలో ప్రావీణ్యం సంపాదించారు. అలా ఆయన రాసిన కవితలని ఒకసారి విన్న గూడవల్లి రామబ్రహ్మ్మం గారు గుర్తు పెట్టుకుని రైతు బిడ్డ సినిమా మొదలు పెట్టినప్పుడు కొసరాజు గారికి కబురు పెట్టి పాటలు రాయించు కున్నారు. అలా కొసరాజు గారి కవిత్వం సినిమా పాటలో చేరి మనకి చేరింది . నిజానికి రైతు బిడ్డ సినిమా కి ముందు సినిమా కి మాటలు , పాటలు ఒక్కరే రాసేవారు . కాని మొదటి సారి ఈ సినిమా కి తాపీ ధర్మారావు ,గోపి చంద్ గార్లు మాటలు రాస్తే పాటలు కొసరాజు గారు, సముద్రాల తాపీ  రాసారు.  ఇంకో విశేషం ఏంటంటే ఈ చిత్రం లో కొసరాజు గారు నటించారు కూడా. ఈ చిత్రం తర్వాత ఒక పదమూడేళ్ళు కొసరాజు గారుకి సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబందాలు లేవు. మల్లి కే.వి . రెడ్డి గారు పెద్దమనుషులు సినిమా మొదలు పెట్టి నప్పుడు అందులో కొన్ని వ్యంగ్య ధోరిణి పాటలు ని ఎవరితో రాయించాలి అన్నప్పుడు మల్లి కొసరాజు గారి పేరు బయటికి వచ్చింది. నరసరాజు గారు కొసరాజు గారిని ఒప్పించి ఆ సినిమాలో పాటలు రాయించారు. నందామయ గరుడ నందమయ , శివ శివ మూర్తివి గణనాధ , పాటలు గుర్తు ఉన్నాయా ? అవి ఆ రోజుల్లో ఎంత హిట్ అయ్యాయంటే రిక్షా వాళ్ళ నుంచి , పొలాల్లో పనిచేసే వాళ్ళ దాకా అందరి నోట్లో ఆ పాటలు నానేవి. అప్పుడు అసలు ఎవరీ కొసరాజు అన్న చర్చ మొదలయ్యింది . ఇక ఆ తర్వాత బి.ఏ . సుబ్బారావు గారి రాజు పేద సినిమా కోసం కొసరాజు గారు రాసిన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

ఆ తర్వాత వచ్చిన రోజులు మారాయి సినమా పాటలతో కొసరాజు గారు మద్రాస్ లోనే వుండిపోయి వరసగా అధ్బుతమైన పాటలు  రాసారు. ఆయన పాటలు అంత హిట్ అవ్వటానికి కారణం తేలిక మాటలు తో సామాన్య జననానికి కూడా హత్తుకునేల , అర్ధం అయ్యేలా రాయటం . అలా అని ఆయన కి వున్న పాండిత్యం ఎమన్నా తక్కువా ? అవదాన్నాల్లో పేరు గడించిన పండితుడు. తన పాండిత్యాన్ని , తన విద్య ని సామాన్య జనానికి తేలిక పదాలతో చేర్చే ప్రయత్నం చేసారు . ఆయన మాటల్లో చెప్పాలంటే " ఒక్కసారి వినగానే టక్కున పట్టుకునేలా వుండాలి పాట , అప్పుడే జనాదరణ పొందుతుంది .అలాగే ఆ పాట కి సంగీతము , సన్నివేశం కూడ తోడ్పడాలి.అప్పుడే ఆ పాట హిట్ అవుతుంది. అయితే మాటలు తేలికగా వుండచ్చేమో కాని అవి పొయిటిక్ గా ఉంటేనే పాట కి అందం " నిజమే పాటల ప్రేమికుల మనసు తెలిసిన కవి కాబట్టే ఇప్పటికీ ఆయన పాటలు మన మనసు దోచుకుంటూ , కాలం తో సంబంధం లేకుండా మనల్ని అలరిస్తున్నాయి.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.