రోడ్డుపై జోరుగా హుషారుగా కత్రినా సైక్లింగ్!
on Aug 8, 2020
నేటి సినీ తారలు ఫిట్నెస్కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో చెప్పనవసరం లేదు. 37 ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ కత్రినా కైఫ్ తన తీర్చిదిద్దినట్లుండే శరీరాకృతితో అందరి దృష్టినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఆమె స్లిమ్ ఫిగర్ని చూస్తే చాలు.. జిమ్కీ, వర్కవుట్స్కీ ఆమె ఎంత టైమ్ వెచ్చిస్తుందో ఊహించుకోవచ్చు. కెరీర్ ప్రారంభం నుంచీ తన స్టన్నింగ్ లుక్స్తో ఆకట్టుకుంటూ వస్తోన్న కత్రినా ఇప్పటికీ యూత్కు ఆరాధ్య తారే.
కత్తిలాంటి కత్రినా లేటెస్ట్గా ముంబైలోని బాంద్రారోడ్డుపై జనానికి దర్శనమిచ్చింది. కొంతమంది స్నేహితులతో కలిసి బాంద్రా రోడ్డులో సాయంత్రం పూట సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తున్న ఆమె కెమెరా కంటికి చిక్కింది. తలకు క్యాప్, ముఖ్యానికి మాస్క్ వేసుకున్న ఆమెను మొదట జనం గుర్తించలేదు. ఆమె ధరించిన షర్ట్, ప్యాంట్, షూస్, గ్లోవ్స్, క్యాప్, మాస్క్ అన్నీ బ్లాక్ కలర్వే కావడం గమనార్హం.
సముద్ర తీరం పక్కనే ఉండటంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సైక్లింగ్ చేస్తున్న కత్రినా కరోనా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం విస్మరించలేదు. మొత్తానికి కత్రినాను గుర్తుపట్టిన సెల్ఫోన్ కెమెరాలు క్లిక్మన్నాయి. కత్రినా ప్రస్తుతం 'సూర్యవంశీ' మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఆమె అక్షయ్కుమార్ జోడీగా కనిపించనున్నది.
Also Read