'గోవిందుడు అందరి వాడేలే' బాపుకు అంకితం
on Sep 25, 2014
తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుడు బాపుపట్ల తనకున్న అభిమానాన్ని దర్ళకుడు కృష్ణ వంశీ చాటుకోబోతున్నారు. తాను చేస్తున్న 'గోవిందుడు అందరి వాడేలే' సినిమాను దివంగత దర్శకుడు బాపు కు అంకితం ఇవ్వలన్న అభిప్రాయాన్ని యూనిట్ సభ్యులతో చెప్పారట. తెలుగు అనుబంధాలకు ప్రతీకగా నిలిచే గోవిందుడు లాంటి చిత్రాన్ని బాపుకు అంకితమిస్తే బాగుంటుందని వారు కూడా భావించారట. ఈ మేరకు బాపు చిత్రపటాన్ని ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో చేర్చినట్లు సమాచారం. మంచి కుటుంబ కథాచిత్రమైన గోవిందుడు అందరివాడేలే సినిమాను బాపుకి అంకితం ఇవ్వాలనుకోవడం మంచి నిర్ణయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
