రితీశ్ను తొలిసారి చూసి పోకిరి అనుకున్న జెనీలియా!
on Oct 17, 2020
మన 'బొమ్మరిల్లు' హాసిని జెనీలియా, మహారాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్, బాలీవుడ్ నటుడు రితీశ్ దేశ్ముఖ్ను పెళ్లాడి జీవితంలో సెటిలయ్యింది. 2002లో 'తుఝే మేరీ కసమ్' సినిమాలో జంటగా నటించినప్పుడు ఆ ఇద్దరూ మొదటిసారిగా కలుసుకున్నారు. అయితే అప్పుడు తాము జీవితాంతం ఒకరికొకరు కలుసుండే భార్యాభర్తలమవుతామని ఆ ఇద్దరిలో ఎవరూ అనుకోలేదు. రితీశ్ను తొలిసారి చూసినప్పుడు అతడు బాగా అల్లరిచేసే ఆకతాయి అనీ, పోకిరోడు అనీ భావించింది జెనీలియా. రోజులు గడిచే కొద్దీ అతనిలో ఇంట్రెస్టింగ్ పర్సన్ ఉన్నాడనే విషయం గ్రహించింది. అప్పుడు మొదలైన వారి ఫ్రెండ్షిప్ క్రమేణా ప్రేమగా మారింది.
తమ తొలి పరిచయం గురించి రితీశ్ మాట్లాడుతూ, "హైదరాబాద్కు 'తుఝే మేరీ కసమ్' మూవీ టెస్ట్ షూట్ కోసం వెళ్లాను. ఎందుకంటే ఆ సినిమాలో నా సరసన నటించే అమ్మాయి అక్కడ ఉందని నాకు చెప్పారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి, జెనీలియా వాళ్లమ్మను మీట్ అయ్యాను. ఆ తర్వాత ఈ పొడుగు పిల్లను చూశాను. ఆమె నన్ను పట్టించుకోకుండా, ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తోంది. ఈ అమ్మాయేంటి ఇలా బిహేవ్ చేస్తోంది? అనుకున్నాను." అని చెప్పాడు.
ఆ వెంటనే అందుకున్న జెనీలియా, "నేను హాయ్ చెప్పాను. తను హైదరాబాద్కు వచ్చే రెండు రోజుల ముందు అతను చీఫ్ మినిస్టర్ కొడుకని చెప్పారు. దాంతో అతను ఆకతాయిగా, పోకిరిగా, ఒక రాజకీయ నాయకుడి కొడుకు లాగానే ఉంటాడనుకున్నాను. అతను నాపై యాటిట్యూడ్ చూపే ముందే నేనే యాటిట్యూడ్ చూపించాలనుకున్నాను. లేకపోతే, నేను సాధారణంగా మొహమాటస్తురాలిని, రిజర్వ్డ్గా ఉండే అమ్మాయిని" అని నవ్వుతూ చెప్పింది.
Also Read