స్పెషల్ డేన `దృశ్యం 2` రీమేక్ షురూ
on Feb 26, 2021
విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `దృశ్యం` (2014) ఒకటి. మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ `దృశ్యం` (2013)కి రీమేక్ గా శ్రీప్రియ దర్శకత్వంలో వెంకీ నటించిన సదరు ఫ్యామిలీ థ్రిల్లర్.. బాక్సాఫీస్ వద్ద విన్నర్ గా నిలిచింది. కట్ చేస్తే.. ఒరిజినల్ వెర్షన్ `దృశ్యం`కి సీక్వెల్ గా మలయాళంలో తెరకెక్కిన `దృశ్యం 2`ని.. ఇప్పుడు రీమేక్ చేసే పనిలో ఉన్నారు వెంకీ. అంతేకాదు.. ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ నే.. ఈ సీక్వెల్ ని రీమేక్ చేయబోతున్నారు. అలాగే.. నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు, చేర్పులు కూడా జోడిస్తున్నారని టాక్.
ఇదిలా ఉంటే.. `దృశ్యం 2` రీమేక్ ని విమెన్స్ డే (మార్చి 8) సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబోతున్నారట. అదేవిధంగా.. శరవేగంగా సినిమాని పూర్తిచేసి జూన్ లేదా జూలైలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. త్వరలోనే `దృశ్యం 2` రీమేక్ కి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. మరి.. `దృశ్యం` లాగే `దృశ్యం 2` కూడా తెలుగునాట వసూళ్ళ వర్షం కురిపిస్తుందేమో చూడాలి.