"మీ ఫేవరేట్ డ్రగ్ ఏది?".. నమ్రతకు నెటిజన్ల ప్రశ్నల వర్షం!
on Sep 24, 2020
సూపర్స్టార్ మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ తన ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ను పరిమితం చేసేసింది. కారణం.. "మీరు డ్రగ్స్ తీసుకుంటారా?" అనే కామెంట్స్ వెల్లువలా వస్తుండటమే. బాలీవుడ్ డ్రగ్ కేసులో భాగంగా ఎన్సీబీ చేస్తున్న దర్యాప్తులో వెల్లడైన వాట్సాప్ చాట్స్లో నమ్రత పేరు బయటకు వచ్చినప్పట్నుంచీ ఆ కామెంట్స్ రావడం మొదలైంది.
సోమవారం ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక ఫొటో షేర్ చేసింది. అందులో టేబుల్ ముందు పుస్తకం పెట్టుకొని, ఒక చేయిని చెంపకు ఆన్చి కూర్చొని చూస్తోంది నమ్రత. టేబుల్పై స్పెక్ట్స్, యాపిల్ హోమ్పాడ్ కూడా ఉన్నాయి. ఒక మంచి పుస్తకంతో గడపడం కంటే ఉత్తమమైంది ఏదీ లేదు. అండ్ మై హోమ్పాడ్ అంటూ దానికి కాప్షన్ పెట్టింది. ఈ పిక్చర్కు వచ్చిన కామెంట్స్లో చాలావరకు ఆమె డ్రగ్స్ తీసుకుంటుందా, ఆమె ఫేవరేట్ డ్రగ్ ఏంటి, కనీసం మీ నుంచి ఇలాంటిది ఊహించలేదు.. అనే తరహా కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి.
టాలెంట్ మేనేజర్ జయ సాహాను ఎన్సీబీ ఇంటరాగేట్ చేసిన సందర్భంలో ఆమె.. కొంతమంది సెలబ్రిటీల కోసం నిషేధిత సీబీడీ ఆయిల్ను ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది. ఆమె వెల్లడించిన పేర్లలో నమ్రతా శిరోద్కర్ పేరు కూడా ఉందని ప్రచారంలోకి వచ్చింది. ఎన్సీబీ ఆమెకు సమన్లు జారీ చేసిందిన ముంబై టాబ్లాయిడ్ డీఎన్ఏ రిపోర్ట్ చేసింది.
Also Read