పెళ్లయిన ఒకటిన్నర నెలకే ప్రెగ్నెన్సీ.. దియా మీర్జాపై ట్రోలర్స్ దాడి!
on Apr 3, 2021
నాగార్జున భార్యగా నటించడం ద్వారా 'వైల్డ్ డాగ్' మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన దియా మీర్జా తల్లి కాబోతోంది. వ్యాపారవేత్త అయిన భర్త వైభవ్ రేఖి ద్వారా తొలి బిడ్డను కనబోతోంది. ఒక ప్రైవేట్ వేడుకలో ఫిబ్రవరి 15న దియా, వైభవ్ దంపతులుగా మారారు. ఆ వేడుకకు వారి కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహిత స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.
తన ఎత్తయిన పొట్టను చూపిస్తూ ఓ పిక్చర్ను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసింది 39 సంవత్సరాల దియా. దానికి, "Blessed to be... One with Mother Earth... One with the Life Force that is the beginning of everything... Of all stories. Lullabies. Songs. Of new saplings. And the blossoming of hope. Blessed to cradle this purest of all dreams in my womb." అంటూ పొయెటిక్గా తన ఫీలింగ్స్ను రాసుకొచ్చింది.
ఇటీవలే భర్త వైభవ్, తన సవతి కుమార్తె సమైరాలతో మాల్దీవులకు వెళ్లి, అక్కడ సరదాగా గడిపి వచ్చింది దియా. ఇదివరకు దియా నిర్మాత సాహిల్ సంఘాను వివాహం చేసుకొని, ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2019లో విడిపోయింది.
దియా తల్లి కాబోతున్న వార్త తెలిసిన వెంటనే అనేకమంది ఆమె స్నేహితులు, ఫిల్మ్ ఫ్రాటర్నిటీ శుభాకాంక్షలు తెలిపారు. కొంతమంది నెటిజన్లు మాత్రం ఫిబ్రవరిలో పెళ్లి, ఏప్రిల్లో ప్రెగ్నెన్సీయా అంటూ ట్విట్టర్ వేదికగా ట్రోల్ చేస్తున్నారు. నిజమేమంటే పెళ్లి చేసుకోవడాని కంటే ముందే దియా గర్భం దాల్చిందనీ, ఆ విషయం ప్రకటించడానికే పెళ్లి చేసుకుందనీ వారు ట్రోల్ చేస్తున్నారు.
పెళ్లయిన వెంటనే ప్రెగ్నెన్సీ రావడం వల్ల ట్రోలింగ్కు గురైన సెలబ్రిటీల్లో దియా మొదటి స్త్రీ కాదు. ఇదివరకు 2018లో ఇలాంటి ట్రోల్స్కే గురయ్యింది నేహా ధూపియా. అంగద్ బేడితో పెళ్లయిన కొద్ది రోజులకే ఆమె తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. అదే ఏడాది వారికి మెహర్ అనే అమ్మాయి పుట్టింది. ఇప్పుడు దియా మీర్జా వంతన్న మాట!
Also Read