'ఆచార్య' టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!
on Jan 27, 2021
ఎప్పుడెప్పుడా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న 'ఆచార్య' టీజర్ రిలీజ్ డేట్కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. 'ఆచార్య'గా మెగాస్టార్ చిరంజీవి ఎలా కనిపిస్తాడో, ఏం చేస్తాడో చూడాలని ఫ్యాన్స్ తహతహలాడుతూ వస్తున్నారు. కొత్త సంవత్సరారంభం సందర్భంగా కానీ, సంక్రాంతికి కానీ, ఆఖరుకి రిపబ్లిక్ డేకి కానీ ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో వారు డిజప్పాయింట్ అయ్యారు. దీంతో టీజర్తో వారిని ఆనందింపజేయడానికి డైరెక్టర్ కొరటాల శివ రెడీ అవుతున్నాడు. జనవరి 29 సాయంత్రం 4:05 గంటలకు టీజర్ను రిలీజ్ చేస్తున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించాడు.
లేటెస్ట్గా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన పోస్ట్లో, "Dear @KChiruTweets sir, The Doors to Dharmasthali will open on 29th Jan at 4:05 PM" అంటూ ట్వీట్ చేశాడు. సినిమాలో జరిగే కథకు కేంద్ర స్థానం ధర్మస్థలి అనే ప్రదేశం. అందుకే ధర్మస్థలికి తలుపులు 29 జనవరి సాయంత్రం 4:05 గంటలకు తెరుచుకుంటాయని ఆయన చెప్పాడు. ఆ పోస్ట్తో పాటు టీజర్ ఎనౌన్స్మెంట్కు సంబంధించిన ఓ వీడియో క్లిప్ను కూడా కొరటాల షేర్ చేశాడు. అందులో ఆచార్య టైటిల్ ఇంగ్లీష్ అక్షరాల్లో ఒక్కోదానికి ఒక్కో అర్థాన్ని చెపుతూ వచ్చారు.
"A prestigious project was conceptualized.
Chiranjeevi garu was back at the best.
Hurdles appeared in the form of a pandemic.
After a long wait, we could go back to shoot.
Resilient people and restless schedules made it possible.
You will soon see a glimpse of our love and hard work.
Arriving soon to amaze you all."
వెరసి.. ACHARYA (ఆచార్య) అవుతుందని చూపించారు.
కొరటాల ట్వీట్కు మెగాస్టార్ స్పందించారు. "Thank you @sivakoratala for keeping the promise." అంటూ రిప్లై ఇచ్చారు.
అంతకు ముందు బుధవారం సాయంత్రం తనకూ, కొరటాలకూ మధ్య సీరియస్గా సంభాషణ జరిగిందనీ, 6:30 గంటలకు అప్డేట్ చేస్తాననీ చిరంజీవి ట్వీట్ చేశారు. చెప్పినట్లే, 6:30 గంటలకు తమ మధ్య జరిగిన సంభాషణను ఫొటో స్టోరీ రూపంలో పంచుకున్నారు. ఆయన పంచుకున్న సంభాషణ ఎలా ఉందంటే..
"చిరు: ఏమయ్యా కొరటాలా.. ఆచార్య టీజర్ న్యూ ఇయర్కి లేదు, సంక్రాంతికి లేదు, ఇంకెప్పుడు...
కొరటాల: సర్, అదే పనిలో ఉన్నా!
చిరు: ఎప్పుడో చెప్పకపోతే లీక్ చెయ్యడానికి రెడీగా ఉన్నా...
కొరటాల: రేపు మార్నింగే అనౌన్స్మెంట్ ఇస్తా సార్!
చిరు: ఇస్తావ్గా...
కొరటాల: అనౌన్స్మెంట్ రేపు మార్నింగ్ 10 గంటలకు ఫిక్స్ సర్!"
చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర చేస్తుండగా, అతని జోడీగా పూజా హెగ్డే కనిపించనున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై రామ్చరణ్, నిరంజన్రెడ్డి సంయుక్తంగా 'ఆచార్య'ను నిర్మిస్తున్నారు.