ముందు చిరు.. తరువాత పవన్..
on Jan 16, 2021
మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పోటీపడి మరీ రీమేక్స్ చేస్తున్నారిప్పుడు. మెగాస్టార్ చిరు ప్రస్తుతం చేస్తున్న సోషల్ డ్రామా ఆచార్య సంగతి వదిలేస్తే.. ఆపై రానున్న లూసీఫర్, వేదాళమ్ రెండు కూడా రీమేక్ వెంచర్స్. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రానున్న బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ వకీల్ సాబ్, సాగర్ కె. చంద్ర డైరెక్టోరియల్.. రెండు కూడా రీమేక్స్ నే.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అటు చిరు, ఇటు పవన్ ఇద్దరు కూడా మలయాళ సినిమాల రీమేక్స్ లో నటిస్తుండడం. చిరు చేయనున్న లూసీఫర్.. పవన్ నటించనున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్.. రెండు కూడా మలయాళ చిత్రాలకి తెలుగు వెర్షన్స్ నే.
అంతేకాదు.. ఈ రెండు సినిమాల తాలూకు షూటింగ్స్ ఒక రోజు గ్యాప్ లో మొదలు కానున్నాయని టాక్. జనవరి 21 నుంచి చిరు లూసీఫర్ రీమేక్ షూటింగ్ మొదలవుతుందని టాక్ వినిపిస్తుండగా.. జనవరి 22 నుంచి పవన్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తాజాగా యూనిట్ వెల్లడించింది.
మొత్తమ్మీద.. ముందు చిరు, తరువాత పవన్ మలయాళ రీమేక్స్ ని పట్టాలెక్కిస్తారన్నమాట. మరి.. ముందుగా ఎవరి మలయాళ రీమేక్ వెండితెరపై వెలుగులు పంచుతుందో చూడాలి.