అతనెప్పుడూ నాతో మిస్బిహేవ్ చెయ్యలేదు.. నోరు విప్పిన 'కాలా' హీరోయిన్!
on Sep 22, 2020
డైరెక్టర్ అనురాగ్ కశ్యప్పై నటి పాయల్ ఘోష్ చేసిన "మీ టూ" ఆరోపణలపై బాలీవుడ్ తార హుమా ఖురేషి నోరు విప్పింది. కశ్యప్ డైరెక్ట్ చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్' మూవీతోటే ఆమె నాయికగా పరిచయమైంది. తనతో కశ్యప్ ఎన్నడూ తప్పుగా ప్రవర్తించలేదని ఓ ప్రకటన ద్వారా తెలిపింది హుమ. సోషల్ మీడియా ఫైట్లు, వాటిపై మీడియా చేసే హంగామాను తాను నమ్మను కాబట్టే ఇంతదాకా ఈ కాంట్రవర్సీతో తాను కామెంట్ చేయలేదని ఆమె తెలిపింది. 'కాలా' మూవీలో రజనీకాంత్ ప్రేయసిగా నటించిన ఆమె వేధింపులకు గురైనవాళ్లెవరైనా కచ్చితంగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చెయ్యాలని సూచించింది.
ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసిన స్టేట్మెంట్లో హుమ, "అనురాగ్, నేను చివరిసారిగా 2012-13లో కలిసి పనిచేశాం. అతను నాకు డియర్ ఫ్రెండ్. చాలా ప్రతిభావంతుడైన దర్శకుడు. నా అనుభవంలోనూ, నాకు తెలిసినంత వరకూ అతను నాతో కానీ, ఇంకెవరితో కానీ తప్పుగా ప్రవర్తించలేదు. ఏదేమైనా, ఎవరైనా వేధింపులకు గురయ్యామనుకుంటే కచ్చితంగా పోలీసులు, న్యాయవ్యవస్థ లాంటి యంత్రాంగాలకు ఫిర్యాదు చెయ్యాలి" అని పేర్కొంది.
అంతకుముందు రిలీజ్ చేసిన ఓ వీడియోలో అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడంటూ పాయల్ ఘోష్ ఆరోపించింది. అందులో రిచా చద్దా, హుహా ఖురేషి వంటివాళ్లు అనురాగ్తో శారీరక సంబంధం పెట్టుకున్నారనీ, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి అతనితో గడిపేవాళ్లంటూ ఆరోపించింది. ఈ వ్యవహారంలో తనను లాగడంపై పాయల్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇప్పటికే రిచా ప్రకటించగా, ఇప్పుడు హుమ సైతం పాయల్ ఆరోపణలను ఖండించింది.
Also Read