పాయల్ కేసులో అనురాగ్ కశ్యప్కు సమన్లు.. నేడు ప్రశ్నించనున్న పోలీసులు!
on Sep 30, 2020
డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనను రేప్ చేశాడంటూ నటి పాయల్ ఘోష్ చేసిన ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు గురువారం విచారణకు రావాల్సిందిగా ఆయనకు సమన్లు జారీ చేశారు. అంధేరిలోని యారీ రోడ్లో నివాసం ఉంటున్న ఆయనకు బుధవారం వెర్సోవా పోలీస్ స్టేషన్ అధికారులు ఈ సమన్లు జారీ చేశారు. తన ఫిర్యాదును దర్యాప్తు చేయడంలో పోలీసులు అలసత్వం చూపుతున్నారని పాయల్ ఆరోపించిన కొన్ని రోజుల తర్వాత వారు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
గత వారం నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో, కశ్యప్ తనపై అత్యాచారం చేసి, తన గౌరవానికి భంగం కలిగించి, తన ఇష్టానికి వ్యతిరేకంగా నిర్బంధించారని పాయల్ ఆరోపించారు. 2013లో ఈ లైంగిక వేధింపులు చోటు చేసుకున్నాయని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ముగ్గురు తారలతో కూడా కశ్యప్ తప్పుగా ప్రవర్తించారని ఆమె చేసిన ఆరోపణలను ఆ తారలు ఖండించారు. పాయల్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఒక రోజు తర్వాత కశ్యప్ ఓ ప్రకటన వెలువరించాడు.
Also Read