అక్కినేని అఖిల్ ను టార్గెట్ చేశారు...!
on Jul 6, 2016
గత వారం సింగపూర్ లో జరిగిన 'సైమా' అవార్డ్స్ కార్యక్రమంలో అఖిల్ ను టార్గెట్ చేస్తూ..హీరో రానా, మంచు లక్ష్మీ సెటైర్లు వేశారు. ఈ సెటైర్లు వేడుకలో ఉన్న వారికి నవ్వు తెప్పించినా..అఖిల్ ను మాత్రం అసహనానికి గురి చేసింది. నిజానికి అఖిల్ కు బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డ్ వచ్చింది. దీంతో స్టేజీ మీద తన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న అఖిల్ ను రానా ర్యాగింగ్ చేశాడు. అఖిల్ మాట్లాడుతున్నప్పుడు రానా తన పక్కగా వచ్చి నవ్వుతూ.. 'నీ వయసెంత' అని అడగగా..అఖిల్ తడుముకోకుండా 22 అని చెప్పాడు. దానికి రానా నాకు 32 ఏళ్ళు వచ్చినా.. ఇంకా పెళ్లి కావట్లేదు. సరైన అమ్మాయి కూడా దొరకట్లేదు. అలాంటిది నువ్వు పెళ్లి విషయంలో ఎందుకు అంత తొందర పడుతున్నావని అడిగాడు. వెంటనే మంచు లక్ష్మీ మైక్ అందుకొని నేను అమెరికా నుండి తిరిగి రాగానే అఖిల్ ప్రేమ వ్యవహారం పేపర్లలో చదివి షాక్ అయ్యానంటూ.. మాట కలిపింది. ఈ మాటలకు అక్కడ ఉన్న వారు బాగా ఎంజాయ్ చేసినా.. అఖిల్ మొహం మాత్రం తెల్లబోయింది.