మైత్రీ సంస్థలో అఖిల్ రొమాంటిక్ ఎంటర్టైనర్?
on Jun 13, 2021
అక్కినేని బుల్లోడు అఖిల్ తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా తరువాత స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' మూవీ చేయబోతున్నాడు అఖిల్. ఇదో యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. సాక్షి వైద్య నాయికగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఇదిలా ఉంటే.. 'ఏజెంట్' తరువాత హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ లో అఖిల్ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడట. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని టాక్. అయితే, దర్శకుడు ఎవరు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే అఖిల్ - మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ మూవీపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కాగా, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో అఖిల్ అన్న, యువ సామ్రాట్ నాగచైతన్య ఇప్పటికే 'సవ్యసాచి' (2018) చేశాడు. చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో.. అఖిల్ కి అయినా మైత్రీ కాంబినేషన్ కలిసొస్తుందేమో చూడాలి.
Also Read