వైఎస్ జగన్పై కూడా సినిమా?
on Jan 19, 2019
దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా 'యాత్ర' సినిమా తెరకెక్కింది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించిన ఈ సినిమాకు 'ఆనందో బ్రహ్మ' ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకుడు. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా ఓ సినిమా తెరకెక్కుతోందట. నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి జగన్పై సినిమా తీస్తున్నారని ఫిలింనగర్ టాక్. తెలుగు ఇండస్ట్రీలో వైఎస్సార్సీసీ మద్దతుదారుల్లో పోసాని ఒకరు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరుగుతూ జగన్ పార్టీకి మద్దతుగా పోసాని పలుసార్లు మాట్లాడారు. ఇప్పుడు సినిమా తీస్తున్నారని సమాచారం. ఆల్రెడీ పులివెందుల పరిశ్రమ ప్రాంతాల్లో చిత్రీకరణ ప్రారంభించారట. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జగన్ మనోగతాన్ని, ఆయనలో పోరాట పటిమను ఆవిష్కరించేలా ఈ సినిమా వుంటుందట.